ఈ ప్రపంచంలో ప్రతి తల్లి తన బిడ్డను నవమాసాలు మోసి కని పెంచి పెద్ద చేస్తుంది. అలాంటి బిడ్డ పెరిగి పెద్దయిన తర్వాత కొందరికి తన తల్లి భారంగా మారుతుంది. ఇలా ఓ కొడుకు జులాయిగా తిరుగుతూ తన తల్లి డబ్బులు ఇవ్వలేదన్న కారణం చేత ఆమె మెడకు కరెంటు వైరును బిగించి చంపేశాడు. ఈ ఘటన వికారాబాద్ పరిగి మండలం కుదావంద్ పూర్ లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
స్థానికంగా ఉన్న భీమమ్మ, ఆమె కొడుకు బలవంత్ లు తమకున్న కొంత పొలంతో జీవనం సాగించేవారు. అయితే భీమమ్మ కొడుకు ఏ పని చేయకుండా జులాయిగా తిరుగుతూ తన తల్లి పెన్షన్, రైతుబంధు డబ్బులను లాక్కొని మద్యం సేవిస్తూ జులాయి తిరుగుళ్ళు తిరిగే వాడు. తన కొడుకు ఈ విధంగా బాధ్యత లేకుండా ప్రవర్తిస్తుండడంతో తరచూ వీరి మధ్య గొడవలు జరిగేవి.
ఒకరోజు తనకు డబ్బులు కావాలని తన తల్లిని ఎంతో ఒత్తిడికి గురి చేసిన బలవంత్ తన తల్లి డబ్బులు ఇవ్వకపోవడంతో అతని మనసులో ఒక ఆలోచన మెదిలింది. తన తల్లి లేకపోతే ఆమె పేరుపై ఉన్న పొలం తన సొంత అవుతుంది, దానికి వచ్చే డబ్బులు కూడా తనకే దక్కుతాయని భావించి తన తల్లి మెడకు కరెంటు వైర్ బిగించి చంపాడు. ఇలా దారుణానికి పాల్పడి ఏమీ ఎరగనట్టు ఉండడంతో ఇతని ప్రవర్తనపై అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అసలు విషయం తెలుసుకున్నారు. బలవంత్ను అరెస్టు చేశారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…