పేగు తెంచుకుని పుట్టిన బిడ్డను కళ్లల్లో పెట్టి కాపాడుకోవాల్సిన ఓ తల్లి తనకి అనారోగ్యం చేసిందని తన పాలిట కసాయి తల్లిగా మారిపోయింది. ఆడబిడ్డ పుట్టడమే ఇష్టంలేని ఆ తల్లి చివరకు ఆ బిడ్డకు అనారోగ్యం చేయటంతో విసుగుచెంది తన బిడ్డను నీటి తొట్టిలోకి వేసి చంపిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం మేరకు..
ఆంధ్రప్రదేశ్ కృష్ణాజిల్లా బాపులపాడు మండలం రేమల్లి గ్రామానికి చెందిన కలపాల హరికృష్ణకు ఆరేళ్ల కిందట చాట్రాయి మండలానికి చెందిన సీతామహాలక్ష్మితో వివాహం జరిగింది. వీరిద్దరు వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరి పెళ్లి జరిగి ఆరు సంవత్సరాలు కావస్తున్నా వీరికి సంతానం కలగకపోవడంతో సంతానం కోసం ఎన్నో ఆసుపత్రుల చుట్టూ తిరిగారు. అయితే సీతా మహాలక్ష్మి గర్భం దాల్చడంతో ఆ కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది.
ఈ క్రమంలోనే సీతామహాలక్ష్మి జూలై 30వ తేదీన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి బిడ్డ ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నారని వైద్య సిబ్బంది వారిద్దరిని డిశ్చార్జ్ చేశారు.ఇంటికి వెళ్ళిన కొద్దిరోజులకు పాప అనారోగ్యానికి గురికావడంతో పాప చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. గొంతులో కొద్దిగా ఇన్ఫెక్షన్ ఉందని వైద్యులు సూచించడంతో మూడు రోజుల పాటు ఆస్పత్రిలో ఉండాలని వైద్యులు చెప్పారు. ఈ క్రమంలోనే కూతురు పుట్టడం నచ్చని సీతామహాలక్ష్మి తనకి ప్రస్తుతం అనారోగ్యం చేయడంతో జీర్ణించు కోలేక కూతురి పట్ల విసుగు చెంది ఆస్పత్రి ఆవరణలో ఒక నీటి తొట్టిలో పడేసింది.
తన బిడ్డ కనిపించడం లేదని హరికృష్ణ ఆస్పత్రి వర్గాలకు తెలియజేయడంతో అందరూ పాప ఆచూకీ కోసం వెతక సాగారు.ఈ క్రమంలోనే పాప నీటి తొట్టిలో విగతజీవిగా పడి ఉండడం చూసి సీతా మహాలక్ష్మి విచారించగా అసలు విషయం బయటపడింది.ఆరు సంవత్సరాల తర్వాత సంతానం కలిగిందని ఆ తండ్రి ఆనందంలో ఉండగా ఆ తల్లి ఏమాత్రం జాలి దయ లేకుండా కన్నబిడ్డను కర్కశంగా చంపడంతో ఆమెపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…