పేగు తెంచుకుని పుట్టిన బిడ్డను కళ్లల్లో పెట్టి కాపాడుకోవాల్సిన ఓ తల్లి తనకి అనారోగ్యం చేసిందని తన పాలిట కసాయి తల్లిగా మారిపోయింది. ఆడబిడ్డ పుట్టడమే ఇష్టంలేని ఆ తల్లి చివరకు ఆ బిడ్డకు అనారోగ్యం చేయటంతో విసుగుచెంది తన బిడ్డను నీటి తొట్టిలోకి వేసి చంపిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం మేరకు..
ఆంధ్రప్రదేశ్ కృష్ణాజిల్లా బాపులపాడు మండలం రేమల్లి గ్రామానికి చెందిన కలపాల హరికృష్ణకు ఆరేళ్ల కిందట చాట్రాయి మండలానికి చెందిన సీతామహాలక్ష్మితో వివాహం జరిగింది. వీరిద్దరు వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరి పెళ్లి జరిగి ఆరు సంవత్సరాలు కావస్తున్నా వీరికి సంతానం కలగకపోవడంతో సంతానం కోసం ఎన్నో ఆసుపత్రుల చుట్టూ తిరిగారు. అయితే సీతా మహాలక్ష్మి గర్భం దాల్చడంతో ఆ కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది.
ఈ క్రమంలోనే సీతామహాలక్ష్మి జూలై 30వ తేదీన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి బిడ్డ ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నారని వైద్య సిబ్బంది వారిద్దరిని డిశ్చార్జ్ చేశారు.ఇంటికి వెళ్ళిన కొద్దిరోజులకు పాప అనారోగ్యానికి గురికావడంతో పాప చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. గొంతులో కొద్దిగా ఇన్ఫెక్షన్ ఉందని వైద్యులు సూచించడంతో మూడు రోజుల పాటు ఆస్పత్రిలో ఉండాలని వైద్యులు చెప్పారు. ఈ క్రమంలోనే కూతురు పుట్టడం నచ్చని సీతామహాలక్ష్మి తనకి ప్రస్తుతం అనారోగ్యం చేయడంతో జీర్ణించు కోలేక కూతురి పట్ల విసుగు చెంది ఆస్పత్రి ఆవరణలో ఒక నీటి తొట్టిలో పడేసింది.
తన బిడ్డ కనిపించడం లేదని హరికృష్ణ ఆస్పత్రి వర్గాలకు తెలియజేయడంతో అందరూ పాప ఆచూకీ కోసం వెతక సాగారు.ఈ క్రమంలోనే పాప నీటి తొట్టిలో విగతజీవిగా పడి ఉండడం చూసి సీతా మహాలక్ష్మి విచారించగా అసలు విషయం బయటపడింది.ఆరు సంవత్సరాల తర్వాత సంతానం కలిగిందని ఆ తండ్రి ఆనందంలో ఉండగా ఆ తల్లి ఏమాత్రం జాలి దయ లేకుండా కన్నబిడ్డను కర్కశంగా చంపడంతో ఆమెపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…