కన్న బిడ్డను కడుపులో పెట్టుకుని చూసుకోవాల్సిన ఆ తల్లి కన్నబిడ్డ పట్ల హంతకురాలుగా మారింది.పేగు తెంచుకుని పుట్టిన బిడ్డ అన్న మమకారం కూడా లేకుండా ఆ బిడ్డపట్ల కర్కశంగా ప్రవర్తించింది ఆ కసాయి తల్లి.ఆవేశంతో అభం శుభం తెలియని ఆ చిన్నారి ప్రాణాలను బలి తీసుకున్న ఘటన అనంతపురం జిల్లా ధర్మవరంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
అనంతపురం జిల్లా ధర్మవరంలోని కొత్త పేటలో నివసిస్తున్నటువంటి మీనాక్షి, శ్రీనివాసులు దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. శ్రీనివాసులు చేనేత పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.ఈ క్రమంలోనే వీరిరువురి మధ్య తరచూ గొడవలు జరగడంతో మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలోనే ఎంతో విసిగిపోయిన మీనాక్షి ఆత్మహత్య చేసుకోవాలనే భావించింది.ఈ క్రమంలోనే శ్రీనివాస్ బయటకు వెళ్ళగా తన పెద్ద కూతురు తనుశ్రీ బయట పిల్లలతో ఆడుకుంటుంది.
ఇక రెండున్నర సంవత్సరాల ప్రణతి ఇంటిలో ఉండగా తన చేతిపై మెడపై కత్తితో దాడి చేసి తాను ఆత్మహత్యకు పాల్పడింది.ఈ క్రమంలోనే చిన్నారి అక్కడే మరణించగా ఈ విషయం గమనించిన స్థానికులు వెంటనే సమాచారాన్ని శ్రీనివాసులకు తెలియజేయడంతో శ్రీనివాసులు అక్కడికి చేరుకొని తన భార్యను ఆస్పత్రికి తరలించారు ఈ విషయం తెలుసుకున్న ధర్మవరం పట్టణ సీఐ కరుణాకర్ ఘటనా స్థలానికి చేరుకొని విచారించగా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు కారణంగానే ఈ ఘటన జరిగిందని నిర్ధారణకు వచ్చి కేసు నమోదు చేసుకున్నారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…