భారత దేశంలోని మహిళలకు బంగారానికి ఎంతో అవినాభావ సంబంధం ఉంది. బంగారం ఎంత ఉన్నా ఇంకా కొనాలనే ఆశ ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ముఖ్యంగా బంగారం ఫ్రీగా వస్తుంది అంటే ఏ మహిళ వదులుకోదు. అచ్చం అదే రీతిలోనే ఎంతో సంపన్నురాలైన ఓ మహిళ బంగారు నగలు ఉచితంగా వస్తున్నాయంటే కక్కుర్తిపడి కోట్లలో మోసపోయింది. చివరికి తాను మోసపోయానని గ్రహించి సైబర్ పోలీసులను ఆదేశించింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
పూణేలోని ఓ కంపెనీలో సీనియర్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్న ఓ మహిళకు ఫేస్బుక్ ద్వారా ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. ఆమె ఆ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయడంతో అవతలి వ్యక్తి ఆమెకు ఒక డాక్టర్ గా పరిచయమయ్యాడు. వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి నంబర్లు మార్చుకొని అప్పుడప్పుడు చాటింగ్ చేసేవారు. ఈ క్రమంలోనే అవతల వ్యక్తి ఆమెకు బంగారు నగలను పంపిస్తున్నా అంటూ ఫోన్ చేసి చెప్పాడు.
సీనియర్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్న ఆమెకు కోట్లలో బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్న ఉచితంగా వచ్చే నగలకు కక్కుర్తి పడింది. ఆ వ్యక్తి ఫోన్ చేసి ఢిల్లీ విమానాశ్రయానికి నగలు వచ్చాయని, వాటిని తీసుకోవడం కోసం కష్టమ్ చార్జీలు భరించాలని చెప్పాడు. ఈ క్రమంలోనే ఆమె అతని ఖాతాకు డబ్బులు పంపింది. మరికొందరు కస్టమ్స్ అధికారుల మంటూ టాక్స్ కడితేనే ఆ నగలు ఇస్తామని ఫోన్లు చేయడంతో వారికి కూడా డబ్బులు చెల్లించింది.
ఈ క్రమంలోనే కొందరు సైబర్ నేరగాళ్లు అధికారుల మంటూ తరచూ ఆమెకు ఫోన్ చేస్తూ డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేసేవారు. మీకు ఇంత విలువైన నగలు ఎక్కడినుంచి వచ్చాయి,డబ్బులు పంపించకపోతే మీ పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తామంటూ బెదిరించారు. ఈ క్రమంలోనే ఆ మహిళ మొత్తం 67 ఖాతాల్లో సుమారు 3.9 కోట్లు జమ చేసింది. 25 బ్యాంకులకు చెందిన ఖాతాలకు 207 ట్రాన్సాక్షన్స్ చేసింది. అయినా ఫోన్ వేధింపులు తగ్గక పోవడంతో ఆమె పోలీసులను ఆశ్రయించి అసలు విషయం బయట పెట్టింది
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్ 2026 విజయం అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన ప్రేరణాత్మక…