భారత దేశంలోని మహిళలకు బంగారానికి ఎంతో అవినాభావ సంబంధం ఉంది. బంగారం ఎంత ఉన్నా ఇంకా కొనాలనే ఆశ ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ముఖ్యంగా బంగారం ఫ్రీగా వస్తుంది అంటే ఏ మహిళ వదులుకోదు. అచ్చం అదే రీతిలోనే ఎంతో సంపన్నురాలైన ఓ మహిళ బంగారు నగలు ఉచితంగా వస్తున్నాయంటే కక్కుర్తిపడి కోట్లలో మోసపోయింది. చివరికి తాను మోసపోయానని గ్రహించి సైబర్ పోలీసులను ఆదేశించింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
పూణేలోని ఓ కంపెనీలో సీనియర్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్న ఓ మహిళకు ఫేస్బుక్ ద్వారా ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. ఆమె ఆ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయడంతో అవతలి వ్యక్తి ఆమెకు ఒక డాక్టర్ గా పరిచయమయ్యాడు. వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి నంబర్లు మార్చుకొని అప్పుడప్పుడు చాటింగ్ చేసేవారు. ఈ క్రమంలోనే అవతల వ్యక్తి ఆమెకు బంగారు నగలను పంపిస్తున్నా అంటూ ఫోన్ చేసి చెప్పాడు.
సీనియర్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్న ఆమెకు కోట్లలో బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్న ఉచితంగా వచ్చే నగలకు కక్కుర్తి పడింది. ఆ వ్యక్తి ఫోన్ చేసి ఢిల్లీ విమానాశ్రయానికి నగలు వచ్చాయని, వాటిని తీసుకోవడం కోసం కష్టమ్ చార్జీలు భరించాలని చెప్పాడు. ఈ క్రమంలోనే ఆమె అతని ఖాతాకు డబ్బులు పంపింది. మరికొందరు కస్టమ్స్ అధికారుల మంటూ టాక్స్ కడితేనే ఆ నగలు ఇస్తామని ఫోన్లు చేయడంతో వారికి కూడా డబ్బులు చెల్లించింది.
ఈ క్రమంలోనే కొందరు సైబర్ నేరగాళ్లు అధికారుల మంటూ తరచూ ఆమెకు ఫోన్ చేస్తూ డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేసేవారు. మీకు ఇంత విలువైన నగలు ఎక్కడినుంచి వచ్చాయి,డబ్బులు పంపించకపోతే మీ పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తామంటూ బెదిరించారు. ఈ క్రమంలోనే ఆ మహిళ మొత్తం 67 ఖాతాల్లో సుమారు 3.9 కోట్లు జమ చేసింది. 25 బ్యాంకులకు చెందిన ఖాతాలకు 207 ట్రాన్సాక్షన్స్ చేసింది. అయినా ఫోన్ వేధింపులు తగ్గక పోవడంతో ఆమె పోలీసులను ఆశ్రయించి అసలు విషయం బయట పెట్టింది
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…
అనిల్ రావిపూడి తనకు అలవాటైన ఫార్ములాను విడిచిపెట్టకుండా, చిరంజీవి బలాలను చక్కగా వినియోగించుకుంటూ మరోసారి సంపూర్ణ వినోదాత్మక చిత్రాన్ని అందించారు.…
ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం గూగుల్ 2026 సంవత్సరానికి సంబంధించిన తన ప్రతిష్ఠాత్మక ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్కు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బ్యాచిలర్,…
ఇస్రోలో ఉద్యోగం సాధించాలనుకునే యువ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలకు ఇది ఒక అరుదైన అవకాశంగా భావిస్తున్నారు. అంతరిక్ష సాంకేతిక రంగంలో దేశ…