భారత దేశంలోని మహిళలకు బంగారానికి ఎంతో అవినాభావ సంబంధం ఉంది. బంగారం ఎంత ఉన్నా ఇంకా కొనాలనే ఆశ ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ముఖ్యంగా బంగారం ఫ్రీగా వస్తుంది అంటే ఏ మహిళ వదులుకోదు. అచ్చం అదే రీతిలోనే ఎంతో సంపన్నురాలైన ఓ మహిళ బంగారు నగలు ఉచితంగా వస్తున్నాయంటే కక్కుర్తిపడి కోట్లలో మోసపోయింది. చివరికి తాను మోసపోయానని గ్రహించి సైబర్ పోలీసులను ఆదేశించింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
పూణేలోని ఓ కంపెనీలో సీనియర్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్న ఓ మహిళకు ఫేస్బుక్ ద్వారా ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. ఆమె ఆ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయడంతో అవతలి వ్యక్తి ఆమెకు ఒక డాక్టర్ గా పరిచయమయ్యాడు. వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి నంబర్లు మార్చుకొని అప్పుడప్పుడు చాటింగ్ చేసేవారు. ఈ క్రమంలోనే అవతల వ్యక్తి ఆమెకు బంగారు నగలను పంపిస్తున్నా అంటూ ఫోన్ చేసి చెప్పాడు.
సీనియర్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్న ఆమెకు కోట్లలో బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్న ఉచితంగా వచ్చే నగలకు కక్కుర్తి పడింది. ఆ వ్యక్తి ఫోన్ చేసి ఢిల్లీ విమానాశ్రయానికి నగలు వచ్చాయని, వాటిని తీసుకోవడం కోసం కష్టమ్ చార్జీలు భరించాలని చెప్పాడు. ఈ క్రమంలోనే ఆమె అతని ఖాతాకు డబ్బులు పంపింది. మరికొందరు కస్టమ్స్ అధికారుల మంటూ టాక్స్ కడితేనే ఆ నగలు ఇస్తామని ఫోన్లు చేయడంతో వారికి కూడా డబ్బులు చెల్లించింది.
ఈ క్రమంలోనే కొందరు సైబర్ నేరగాళ్లు అధికారుల మంటూ తరచూ ఆమెకు ఫోన్ చేస్తూ డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేసేవారు. మీకు ఇంత విలువైన నగలు ఎక్కడినుంచి వచ్చాయి,డబ్బులు పంపించకపోతే మీ పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తామంటూ బెదిరించారు. ఈ క్రమంలోనే ఆ మహిళ మొత్తం 67 ఖాతాల్లో సుమారు 3.9 కోట్లు జమ చేసింది. 25 బ్యాంకులకు చెందిన ఖాతాలకు 207 ట్రాన్సాక్షన్స్ చేసింది. అయినా ఫోన్ వేధింపులు తగ్గక పోవడంతో ఆమె పోలీసులను ఆశ్రయించి అసలు విషయం బయట పెట్టింది
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…