Sai Dharam Tej : మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, నటుడు సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో గాయాల బారిన పడిన సంగతి తెలిసిందే. శుక్రవారం రాత్రి మాదాపూర్లోని తీగల వంతెన మీద నుంచి ఐకియా వైపు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. స్పోర్ట్స్ బైక్ మీద వెళ్తుండగా సడెన్గా బైక్ అదుపు తప్పి రోడ్డు మీద స్కిడ్ అయింది. దీంతో సాయి ధరమ్ తేజ్కు గాయాలయ్యాయి.
అయితే ఈ సంఘటన ఎలా జరిగిందనే విషయంపై పోలీసులు వివరాలను వెల్లడించారు. వర్షం కారణంగా రోడ్డు తడిగా ఉండడంతోపాటు ఆ సమయంలో రోడ్డు మీద ఇసుక ఉందని, దీంతో బైక్ స్కిడ్ అయిందని, అందుకనే ప్రమాదం చోటు చేసుకుందని తెలిపారు. సాయిధరమ్ తేజ్ వాహనాన్ని అదుపు చేయలేకపోయారని అందువల్లే కింద పడిపోయారని అన్నారు.
ప్రమాదం జరిగిన సమయంలో సాయిధరమ్ తేజ్ మద్యం సేవించలేదని, ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉందని పోలీసులు తెలిపారు. కాగా ఆ ప్రమాదం సైబరాబాద్ కమిషనరేట్ లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఐకియా స్టోర్ సమీపంలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో సాయిధరమ్ తేజ్ కుడి కంటి పైభాగంతోపాటు ఛాతిలో గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయనకు అపోలో హాస్పిటల్లో చికిత్సను అందిస్తున్నారు. ప్రస్తుతం వెంటిలేటర్పై చికిత్సను అందిస్తున్నామని, మరో 48 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఐసీయూలో ఉంచుతారని తెలిపారు.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…