క్రైమ్‌

అర‌కులోయ‌లో విషాదం.. త‌ల్లి, ముగ్గురు పిల్ల‌ల మృతి..

విశాఖ‌ప‌ట్నం జిల్లా ప‌రిధిలోని అర‌కు లోయ‌లో విషాదం జ‌రిగింది. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందారు. ఓ మ‌హిళతోపాటు ఆమెకు చెందిన ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్ర‌మంలో న‌లుగురి మృత‌దేహాలు ఇంట్లో క‌నిపించాయి. దీంతో ఈ సంఘ‌ట‌న అనేక అనుమానాల‌ను క‌లిగిస్తోంది. స‌ద‌రు మ‌హిళే త‌న పిల్ల‌ల‌ను చంపి ఆత్మ‌హ‌త్య చేసుకుందా ? లేదా ఆమె భ‌ర్త ఈ విధంగా చేశాడా ? అన్న వివ‌రాలు తెలియాల్సి ఉంది.

అరకులోయ పట్టణం పరిధిలోని పాత పోస్టాఫీస్‌ కాలనీలో ఓ మ‌హిళ‌, ఆమె ముగ్గురు పిల్ల‌లు మృతి చెందారు. ఆమె ఓ గదిలో ఉరి వేసుకొని చనిపోయింది. కాగా ఆమె ముగ్గురు పిల్ల‌లు ఇంకో గదిలో చ‌నిపోయారు. అయితే వారిని హాస్పిట‌ల్‌కు తీసుకెళ్లగా అప్పటికే వారు చ‌నిపోయార‌ని వైద్యులు తెలిపారు.

అరకులోయ మండలం కొత్త బల్లుగూడ పంచాయతీ సిమిలిగూడ గ్రామానికి చెందిన శెట్టి సంజీవరావు జీసీసీలో సేల్స్‌మన్‌గా పనిచేస్తున్నాడు. భార్య శెట్టి సురేఖ (34), కుమార్తె సుశాన్‌ (10), కుమారులు సర్విన్‌ (8), సిరిల్‌(4)లతో కలిసి పాత పోస్టాఫీస్‌ కాలనీలో నివాసం ఉంటున్నారు. అయితే ఆ ఇద్ద‌రు దంప‌తుల‌ మధ్య కొంత కాలంగా గొడ‌వ‌లు జ‌రుగుతున్న‌ట్లు స‌మాచారం. అందులో భాగంగానే శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో భర్త సంజీవరావు ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. తిరిగి రాత్రి 10 గంటలకు ఇంటికి వ‌చ్చాడు. అయితే అప్ప‌టికే మంచంపై ప‌డి ఉన్న త‌న ముగ్గురు పిల్లలను చూసి స్థానికుల సహాయంతో వెంట‌నే అక్క‌డి ఏరియా హాస్పిట‌ల్‌కు తీసుకెళ్లాడు.

పిల్లలను పరీక్షించిన డాక్టర్లు అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. మరోవైపు తల్లి సురేఖ కోసం గాలించగా మరో గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని కనిపించింది. పిల్లలకు అన్నంలో విషం కలిపి తినిపించి, సురేఖ ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నట్లు ఆధారాలు లభించాయని అరకు పోలీసులు తెలిపారు. వంట గదిలో సగం తిన్న భోజనం ప్లేట్లు ఉన్నాయని చెప్పారు. అయితే సంజీవ‌రావే తమ కూతురు, మనవలను హత్య చేసి నాటకాలు ఆడుతున్నాడని సురేఖ కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ క్ర‌మంలో కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క్రికెటర్ కాదు.. ఆర్మీ ఆఫీసర్ అవ్వాలనుకున్నా: జితేష్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు!

తాను మొద‌ట్లో క్రికెట‌ర్ అవుతాన‌ని అనుకోలేద‌ని, భార‌త ఆర్మీలో చేరి సేవ‌లందించాల‌ని చిన్న‌త‌నం నుంచే క‌ల‌లు క‌న్నాన‌ని, కానీ క్రికెట్‌లోకి…

Friday, 27 February 2026, 5:16 PM

మోదీకి ‘విరోష్’ వెడ్డింగ్ ఇన్విటేషన్.. మార్చి 4న హైదరాబాద్‌లో రిసెప్షన్!

మార్చి 4, 2026న హైద‌రాబాద్‌లో జ‌ర‌గ‌నున్న త‌మ వివాహ రిసెప్ష‌న్‌కు హాజ‌రు కావాల‌ని కోరుతూ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీని నూత‌న…

Friday, 27 February 2026, 2:58 PM

ఒక్కటైన విజయ్-రష్మిక.. ఉదయ్‌పూర్‌లో వైభవంగా ‘విరోష్’ వివాహం!

టాలీవుడ్ న‌టీన‌టులు విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న వివాహ బంధం ద్వారా ఒక్క‌ట‌య్యారు. గురువారం (ఫిబ్ర‌వ‌రి 26, 2026) రాజ‌స్థాన్‌లోని…

Thursday, 26 February 2026, 9:41 PM

‘ఉస్తాద్ భగత్ సింగ్’ భారీ ఓటీటీ డీల్.. నెట్‌ఫ్లిక్స్ ఆఫర్ అన్ని కోట్లా?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌, మాస్ ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ మూవీకి గాను…

Thursday, 26 February 2026, 6:59 PM

శ్రీలంక ఆటగాళ్లకు ప్రాణగండం? రక్షణ కల్పించాలని కెప్టెన్ శనక వేడుకోలు!

టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 టోర్నీ సూప‌ర్ 8 ద‌శ‌లో వ‌రుస‌గా రెండు మ్యాచ్‌ల‌ను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్ర‌మించిన…

Thursday, 26 February 2026, 5:01 PM

టాలీవుడ్‌లో కొత్త రూల్.. 8 వారాల తర్వాతే ఓటీటీలోకి సినిమా..?

కొత్త‌గా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా స‌రే క‌చ్చితంగా 8 వారాల త‌రువాతే ఓటీటీలోకి రావాల‌న్న నిబంధ‌న‌పై ప్ర‌స్తుతం…

Thursday, 26 February 2026, 1:20 PM

క్యాన్సర్ రిస్క్ తగ్గించే 5 ఆహారాలు: డాక్టర్ సౌరభ్ సెథి కీలక సూచనలు!

ప్ర‌స్తుతం ప్ర‌పంచ వ్యాప్తంగా క్యాన్స‌ర్ కేసులు గ‌ణ‌నీయంగా పెరుగుతున్నాయ‌ని, యుక్త వ‌య‌స్సులో ఉన్న‌వారికి క్యాన్స‌ర్ ఎక్కువ‌గా వ‌స్తుంద‌ని, 5 ర‌కాల…

Thursday, 26 February 2026, 12:01 PM

విజయ్-రష్మిక పెళ్లికి ప్రధాని మోదీ విషెస్.. ఆ లేఖలో ఏముందంటే?

ఈ నెల 26వ తేదీన రాజ‌స్థాన్‌లోని ఉద‌య్‌పూర్ ఐటీసీ మిమెంటోస్ రిసార్ట్‌లో వివాహం చేసుకోబోతున్న న‌టీన‌టులు విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక…

Wednesday, 25 February 2026, 6:01 PM