తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా పరకాలలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు తన తాత మృతదేహాన్ని ఫ్రిజ్లో దాచి ఉంచాడు. దుర్వాసన రావడంతో ఇరుగు పొరుగు వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే..
వరంగల్ జిల్లా పరకాలకు చెందిన 23 ఏళ్ల నిఖిల్ అనే యువకుడి తాత అనారోగ్య సమస్యల కారణంగా గత 3 రోజుల కిందట మృతి చెందాడు. అయితే అతని మృతదేహాన్ని నిఖిల్ ఫ్రిజ్ లో దాచి ఉంచాడు. మూడు రోజుల పాటు అలా ఉన్నాక దుర్వాసన వస్తుండడంతో ఇరుగు పొరుగు వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని నిఖిల్ తాత మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం డెడ్ బాడీని మార్చురీకి తరలించారు.
అయితే తన వద్ద డబ్బులు లేనందునే తన తాత అంత్యక్రియలు చేయలేదని, అందుకనే డెడ్ బాడీని ఫ్రిజ్ లో దాచి ఉంచానని నిఖిల్ పోలీసుల విచారణలో తెలిపాడు. కాగా అతని తాతకు పెన్షన్ వస్తుండేది. దానిపైనే ఇద్దరూ జీవించే వారు. సడెన్ గా నిఖిల్ తాత చనిపోవడంతో తనకు ఇక ఖర్చులకు ఉండవని భావించిన నిఖిల్ కావాలనే తన తాత మృతదేహాన్ని దాచి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
తాను మొదట్లో క్రికెటర్ అవుతానని అనుకోలేదని, భారత ఆర్మీలో చేరి సేవలందించాలని చిన్నతనం నుంచే కలలు కన్నానని, కానీ క్రికెట్లోకి…
మార్చి 4, 2026న హైదరాబాద్లో జరగనున్న తమ వివాహ రిసెప్షన్కు హాజరు కావాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీని నూతన…
టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26, 2026) రాజస్థాన్లోని…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి గాను…
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ సూపర్ 8 దశలో వరుసగా రెండు మ్యాచ్లను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన…
కొత్తగా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా 8 వారాల తరువాతే ఓటీటీలోకి రావాలన్న నిబంధనపై ప్రస్తుతం…
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని, యుక్త వయస్సులో ఉన్నవారికి క్యాన్సర్ ఎక్కువగా వస్తుందని, 5 రకాల…
ఈ నెల 26వ తేదీన రాజస్థాన్లోని ఉదయ్పూర్ ఐటీసీ మిమెంటోస్ రిసార్ట్లో వివాహం చేసుకోబోతున్న నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక…