జీవితం అంటే 100 ఏళ్ల పంట. ఇక్కడ 100 ఏళ్ల పాటు జీవిస్తాం అని కాదు, కానీ అంత విలువైందని అర్థం. కానీ అలాంటి జీవితం విలువను కొందరు సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారు. చిన్నపాటి కారణాలకే క్షణికావేశంలో బలవంతపు నిర్ణయాలను తీసుకుంటున్నారు. దీంతో కన్న తల్లిదండ్రులకు గర్భశోకం మిగులుస్తున్నారు.
తెలంగాణలో బుధవారం ఎంసెట్ ఫలితాలు విడుదలైన విషయం విదితమే. అయితే ఎంసెట్ లో అర్హత సాధించలేదని ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. నల్గొండ జిల్లా కనగల్ మండలం శాబ్దుల్లా పూర్ గ్రామానికి చెందిన స్నేహ రెడ్డి అనే విద్యార్థిని నల్గొండలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ పూర్తి చేసింది. ఎంసెట్ రాసినప్పటికీ తాజాగా వెల్లడైన ఫలితాల్లో ఆమె అర్హత సాధించలేదు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తల్లిదండ్రులు ఆమె మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే ఆమె ఓ సూసైడ్ లెటర్ కూడా రాసింది.
అమ్మా.. నాన్నా.. నన్ను క్షమించండి. మీకు నా ముఖం చూపించలేకపోతున్నాను.. మీరు నా మీద పెట్టుకున్న ఆశలను నిలబెట్టుకోలేకపోయా.. అందుకు బాధగా ఉంది.. అందుకే మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్లిపోతున్నాను.. అంటూ స్నేహ రెడ్డి సూసైడ్ నోట్ రాసింది. కాగా ఆమె తల్లి ఏఎన్ఎం గా పనిచేస్తోంది. ఈ క్రమంలోనే ఆమె విధి నిర్వహణకు వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చి చూడగా కుమార్తె విగతజీవిగా పడి ఉంది. దీంతో స్నేహా రెడ్డి తల్లిదండ్రులు భోరున విలపిస్తున్నారు. వారి కుటుంబంలో విషాదం నెలకొంది.
తాను మొదట్లో క్రికెటర్ అవుతానని అనుకోలేదని, భారత ఆర్మీలో చేరి సేవలందించాలని చిన్నతనం నుంచే కలలు కన్నానని, కానీ క్రికెట్లోకి…
మార్చి 4, 2026న హైదరాబాద్లో జరగనున్న తమ వివాహ రిసెప్షన్కు హాజరు కావాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీని నూతన…
టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26, 2026) రాజస్థాన్లోని…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి గాను…
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ సూపర్ 8 దశలో వరుసగా రెండు మ్యాచ్లను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన…
కొత్తగా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా 8 వారాల తరువాతే ఓటీటీలోకి రావాలన్న నిబంధనపై ప్రస్తుతం…
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని, యుక్త వయస్సులో ఉన్నవారికి క్యాన్సర్ ఎక్కువగా వస్తుందని, 5 రకాల…
ఈ నెల 26వ తేదీన రాజస్థాన్లోని ఉదయ్పూర్ ఐటీసీ మిమెంటోస్ రిసార్ట్లో వివాహం చేసుకోబోతున్న నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక…