ప్రస్తుతం కోవిడ్ ప్రభావం వల్ల చాలా మంది అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు ఎక్కువగా కంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని వైద్యులు తెలుపుతున్నారు. దగ్గరగా ఉన్న వస్తువులు స్పష్టంగా, దూరంగా ఉన్న వస్తువులను అస్పష్టంగా కనిపించడమే సమస్య అని.. దీనినే మియోపియా అని అంటారని వైద్యులు చెబుతున్నారు. ఈ సమస్య చాలా మంది పిల్లలకు వస్తుందని వారు చెబుతున్నారు.
ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా ఇంట్లో ఉండటం వల్ల ఆన్లైన్ క్లాసులు పెరగడంతో గంటలకొద్దీ మొబైల్స్, కంప్యూటర్ల ముందు క్లాసులు జరగడం వల్ల ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయని చెబుతున్నారు. కోవిడ్ కంటే ముందు ఇప్పుడు ఈ సమస్య రెట్టింపు అయిందని అధ్యయనంలో తేలింది. దీనివల్ల కళ్ళు పొడిబారడం, మెల్ల కన్ను, కళ్ళ కలక వంటి సమస్యలు ఎక్కువగా వస్తాయని వైద్యులు చెబుతున్నారు.
దీంతో పిల్లలు చిన్న వయసులోనే ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, కాబట్టి డిజిటల్ స్క్రీన్ ల ముందు ఎక్కువ సమయాన్ని గడపనివ్వవద్దని సలహాలు ఇస్తున్నారు. ఇక విరామం లేకుండా గంటల కొద్దీ కూర్చోవద్దని, స్క్రీన్ ముందు కనీసం 33 సెంటీ మీటర్ల దూరం ఉండాలని తెలిపారు. ప్రతి 20 నిమిషాలకు ఒకసారి విరామం తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్వేర్ అప్డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్కు అనుసంధానమైన మొబైల్ నంబర్ను అప్డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…