ఓ యువకుడి వేధింపులు తాళలేక పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ప్రతి రోజూ ఆ యువకుడు తనను ప్రేమించాలంటూ సదరు బాలికపై అధిక ఒత్తిడి తీసుకురావడంతో అతని వేధింపులు భరించలేని బాలిక ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయం చూసి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. ఈ ఘటన తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
ఖమ్మం రూరల్ మండలం వెంకటగిరికి చెందిన పదో తరగతి బాలికపై సాయి అనే యువకుడు నిత్యం తనను ప్రేమించాలంటూ మానసిక వేధింపులకు గురి చేసేవాడు. ఈ క్రమంలోనే ఈనెల 9వ తేదీ ఆమెపై అధికంగా ఒత్తిడి చేయడంతో ఎంతో మానసిక వేదన అనుభవించిన విద్యార్థిని తట్టుకోలేక తన తల్లిదండ్రులు పొలానికి వెళ్లిన సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ విషయం గమనించిన స్థానికులు విషయాన్ని తల్లిదండ్రులకు చేరవేయడంతో తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం ఆమెను ఆస్పత్రికి తరలించారు.
ఈ విధంగా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆ యువతి శుక్రవారం సాయంత్రం మరణించడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే బాలికపై వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్య తెలుసుకుందని తెలుసుకున్న పోలీసులు నిందితుడు సాయిని అదుపులోకి తీసుకున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…