మహిళల భద్రత కోసం ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినా, ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా మహిళలపై జరిగే దాడులు మాత్రం ఆగడం లేదు. ఇప్పటికీ ఎంతోమంది మహిళలు వరకట్న వేధింపులకు గురవుతూనే ఉన్నారు. తాజాగా మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్లో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
గ్వాలియర్లోని దబ్రాకు చెందిన వీరేంద్ర కుమార్కు అనే యువకుడికి శశి అనే యువతితో 5 నెలల క్రితం వివాహం జరిగింది.వివాహ సమయంలో వధువు తల్లిదండ్రులు సుమారు 10 లక్షల మేర ఖర్చు చేసి ఎంతో ఘనంగా పెళ్లి జరిపించారు. పెళ్లయిన ఐదు నెలలకే వీరేంద్ర కొత్త కారు కొనాలని అందుకోసం తమ తల్లిదండ్రుల వద్ద మరో మూడు లక్షల రూపాయలు కట్నం తేవాలని శశిని వేధించేవాడు.ఈ క్రమంలోనే ఆమె పెళ్లి కోసమే తమ తల్లిదండ్రులు ఎంతో అప్పు చేశారని మరి కట్నం కావాలంటే ఎక్కడినుంచి తెస్తారని తన భర్తతో వివాదానికి దిగింది.
ఈ క్రమంలోనే వీరిరువురి మధ్య అదనపు కట్నం కోసం గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య గొడవ తారాస్థాయికి చేరి వీరేంద్ర తన భార్య శశిని గొడ్డును బాదినట్టు బాది తన చేత యాసిడ్ తాగించాడు. యాసిడ్ తాగడం వల్ల అపస్మారకస్థితిలో ఉన్న తన భార్యను ఆసుపత్రిలో చేర్పించాడు. యాసిడ్ తాగడం వల్ల ఆమె శరీరంలోని భాగాలన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయని, ఆమెకు తరచూ రక్తపు వాంతులు అవుతున్నాయని తన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ క్రమంలోనే బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. వ్యవహారంపై DCW చీఫ్ స్వాతిమాలివాల్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు లేఖరాశారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాలని
టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26, 2026) రాజస్థాన్లోని…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి గాను…
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ సూపర్ 8 దశలో వరుసగా రెండు మ్యాచ్లను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన…
కొత్తగా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా 8 వారాల తరువాతే ఓటీటీలోకి రావాలన్న నిబంధనపై ప్రస్తుతం…
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని, యుక్త వయస్సులో ఉన్నవారికి క్యాన్సర్ ఎక్కువగా వస్తుందని, 5 రకాల…
ఈ నెల 26వ తేదీన రాజస్థాన్లోని ఉదయ్పూర్ ఐటీసీ మిమెంటోస్ రిసార్ట్లో వివాహం చేసుకోబోతున్న నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక…
భారత అండర్ 19 క్రికెట్ జట్టు యువ కెరటం వైభవ్ సూర్యవంశీకి టాటా మోటార్స్ ఖరీదైన బహుమతిని అందజేసింది. రూ.22…
నటీనటులు డబ్బు బాగా సంపాదించడం ఒకెత్తు అయితే దాన్ని పొదుపు చేయడం మరో ఎత్తు అని, సరైన సమయంలో డబ్బును…