దారుణం.. అత్తను చపాతీ కర్రతో కొట్టి చంపిన కోడలు..

September 1, 2021 1:07 PM

ఒక అమ్మాయి పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్ళిన తర్వాత అత్త తన కోడలిని కన్నకూతురిగా చూసుకుంటుంది. కానీ మరి కొన్నిచోట్ల అత్త అదే అదునుగా భావించి అదనపు కట్నం కోసం, లేదా ఇంటి పనులను చక్కబెట్టడం కోసం కోడలిని ఎంతో దారుణంగా చిత్రహింసలకు గురి చేస్తూ ఉంటుంది. ఈ విధమైన చిత్ర హింసలు భరించలేక ఎంతో మంది మహిళలు ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..

దారుణం.. అత్తను చపాతీ కర్రతో కొట్టి చంపిన కోడలు..

గుంటూరు జిల్లా తెనాలిలో నివాసముంటున్న కోడలు ప్రియాంక తన అత్తపై చపాతీ కర్రతో దాడి చేసింది. ఈ విధంగా చపాతీ కర్రతో దాడి చేయడంతో అత్త మైథిలి అక్కడికక్కడే కుప్పకూలి పడిపోయింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. కోడలు తన అత్తను చంపడానికి గల కారణం ఏంటని పోలీసులు ఆరా తీశారు.

ఈక్రమంలోనే అత్త మైథిలి తన కోడలు ప్రియాంకను తరచూ చిత్రహింసలకు గురి చేసేదని, ఈమె చిత్ర హింసలు భరించలేక వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవని అత్త చిత్ర హింసలు భరించలేక ఆమెపై చపాతీ కర్రతో దాడి చేసిందని తెలుసుకున్న పోలీసులు కోడలు ప్రియాంకపై కేసు నమోదు చేశారు. ఈక్రమంలోనే డెడ్ బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం తరలించగా ఈ కేసును అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now