సాధారణంగా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు, మనస్పర్థలు రావడం సర్వసాధారణమే. అయితే ఈ మనస్పర్ధలు కారణంగా మాట మాట పెరిగి వారి మధ్య గొడవ తారస్థాయికి చేరుకొని క్షణికావేశంలో చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఈ విధంగా ఓ భర్త తన భార్య చికెన్ ఫ్రై సరిగ్గా వండలేదని ఆమెతో గొడవపడి ఆవేశంలో తన భార్యను చంపాడు. ఈ ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
కర్ణాటకకు చెందిన వ్యాపారవేత్త పాషా, షిరిన్ భాను ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు కాగా పాషా బెడ్స్ వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఒక రోజు షిరిన్ చెల్లెలు తన ఇంటికి రావడంతో పాషా వెళ్లి చికెన్ తీసుకువచ్చాడు. ఈ క్రమంలోనే తన భార్య చికెన్ ఫ్రై చేసింది. అయితే చికెన్ సరిగ్గా చేయలేదని షిరిన్ భానుపై పాషా కోప్పడ్డాడు. ఈ క్రమంలోనే వీరిరువురి మధ్య గొడవ తారాస్థాయికి చేరుకుంది.
అయితే తన ఇంట్లో తన మరదలు ఉండటం చేత ఆ గొడవ అక్కడితో ఆగిపోయినప్పటికే తన మరదలు వెళ్లగానే తిరిగి ఒక రోజు ఇదే గొడవ వారి మధ్య చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే పాషా తన భార్యపై ఎంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ పక్కనే ఉన్న కర్ర తీసుకుని తన భార్య తలపై బాదడంతో షిరిన్ భాను అధిక రక్తస్రావంలో కొట్టుమిట్టాడుతూ తీవ్రగాయాలకు గురై ప్రాణాలు కోల్పోయింది. ప్రాణాలు కోల్పోయిన తన భార్య మృతదేహాన్ని తీసుకుని చిక్కబనవర లేక్లో పడేశాడు. తన భార్య మిస్సింగ్ అని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఈ ఘటనపై పోలీసులకు అనుమానం రావడం వల్ల పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. దీంతో అసలు విషయం బయట పెట్టాడు. ఈ క్రమంలోనే పోలీసులు చిక్కబనవర లేక్లో షిరిన్ భాను మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్ 2026 విజయం అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన ప్రేరణాత్మక…