సాధారణంగా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు, మనస్పర్థలు రావడం సర్వసాధారణమే. అయితే ఈ మనస్పర్ధలు కారణంగా మాట మాట పెరిగి వారి మధ్య గొడవ తారస్థాయికి చేరుకొని క్షణికావేశంలో చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఈ విధంగా ఓ భర్త తన భార్య చికెన్ ఫ్రై సరిగ్గా వండలేదని ఆమెతో గొడవపడి ఆవేశంలో తన భార్యను చంపాడు. ఈ ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
కర్ణాటకకు చెందిన వ్యాపారవేత్త పాషా, షిరిన్ భాను ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు కాగా పాషా బెడ్స్ వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఒక రోజు షిరిన్ చెల్లెలు తన ఇంటికి రావడంతో పాషా వెళ్లి చికెన్ తీసుకువచ్చాడు. ఈ క్రమంలోనే తన భార్య చికెన్ ఫ్రై చేసింది. అయితే చికెన్ సరిగ్గా చేయలేదని షిరిన్ భానుపై పాషా కోప్పడ్డాడు. ఈ క్రమంలోనే వీరిరువురి మధ్య గొడవ తారాస్థాయికి చేరుకుంది.
అయితే తన ఇంట్లో తన మరదలు ఉండటం చేత ఆ గొడవ అక్కడితో ఆగిపోయినప్పటికే తన మరదలు వెళ్లగానే తిరిగి ఒక రోజు ఇదే గొడవ వారి మధ్య చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే పాషా తన భార్యపై ఎంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ పక్కనే ఉన్న కర్ర తీసుకుని తన భార్య తలపై బాదడంతో షిరిన్ భాను అధిక రక్తస్రావంలో కొట్టుమిట్టాడుతూ తీవ్రగాయాలకు గురై ప్రాణాలు కోల్పోయింది. ప్రాణాలు కోల్పోయిన తన భార్య మృతదేహాన్ని తీసుకుని చిక్కబనవర లేక్లో పడేశాడు. తన భార్య మిస్సింగ్ అని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఈ ఘటనపై పోలీసులకు అనుమానం రావడం వల్ల పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. దీంతో అసలు విషయం బయట పెట్టాడు. ఈ క్రమంలోనే పోలీసులు చిక్కబనవర లేక్లో షిరిన్ భాను మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…
అనిల్ రావిపూడి తనకు అలవాటైన ఫార్ములాను విడిచిపెట్టకుండా, చిరంజీవి బలాలను చక్కగా వినియోగించుకుంటూ మరోసారి సంపూర్ణ వినోదాత్మక చిత్రాన్ని అందించారు.…
ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం గూగుల్ 2026 సంవత్సరానికి సంబంధించిన తన ప్రతిష్ఠాత్మక ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్కు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బ్యాచిలర్,…
ఇస్రోలో ఉద్యోగం సాధించాలనుకునే యువ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలకు ఇది ఒక అరుదైన అవకాశంగా భావిస్తున్నారు. అంతరిక్ష సాంకేతిక రంగంలో దేశ…
ఆ వ్యాఖ్యతో ముగిసేలా ఎడిట్ చేసిన వీడియో క్లిప్పులు విస్తృతంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫ్యాక్ట్ చెకర్, ఆల్ట్…