ప్రస్తుతం కాలంలో తెరకెక్కే సినిమాలు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా తెరకెక్కుతున్నాయి. ఈ క్రమంలోనే దర్శక నిర్మాతలు సైతం ప్రతి సినిమాను పాన్ ఇండియా స్థాయిలోనే తెరకెక్కిస్తున్నారు. సాధారణంగా ఒక భాషలో సినిమా తీయాలంటే కొన్ని కోట్ల ఖర్చు చేయాల్సి ఉంటుంది. అలాంటిది పాన్ ఇండియా స్థాయిలో అంటే భారీ బడ్జెట్ పెట్టాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే పాన్ ఇండియా స్థాయిలో సినిమా అంటే నటీనటులకు సైతం అధిక మొత్తంలో చెప్పాల్సి ఉంటుంది.
దర్శక నిర్మాతలు కూడా బడ్జెట్ కి ఏమాత్రం వెనుకడుగు వేయకుండా సినిమాలో క్వాలిటీ ఉండే విధంగా డబ్బులు ఖర్చు చేస్తున్నారు .ఈ క్రమంలోనే పాన్ ఇండియా హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్న ప్రభాస్ సినిమాలంటే భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం ప్రభాస్ నటించిన సినిమాలన్నీ ఫాన్ ఇండియా స్థాయిలో రావడం విశేషం. ఇప్పటికే రాదే శ్యామ్, సలార్, ఆది పురుష్ వంటి చిత్రాలతో బిజీగా ఉన్న ప్రభాస్ నాగ అశ్విన్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్న సంగతి మనకు తెలిసిందే.
ప్రభాస్ -నాగ అశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు.పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సుమారు పది మంది బాలీవుడ్ సెలబ్రిటీలను తీసుకునే ఆలోచనలో ఉన్నారు.ఈ క్రమంలోనే కేవలం నటీనటుల కోసం సుమారు 200 కోట్ల రూపాయలు నిర్మాతలు ఖర్చు చేయనున్నట్లు ఫిలిం ఇండస్ట్రీ సమాచారం. కేవలం నటీనటుల కోసమే ఇంత ఖర్చు చేస్తుంటే ఒక సినిమా ఏ స్థాయిలో ఉంటుందో ఇట్టే తెలిసిపోతుంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక నటించనున్నారు. జూలై లో షూటింగ్ ప్రారంభం కావాల్సిన ఈ సినిమా కరోనా కారణం చేత అక్టోబర్ కు వాయిదా వేసినట్టు తెలుస్తోంది.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…