మహానటి కీర్తి సురేష్ ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గుర్తింపును సంపాదించుకున్నారు.ప్రస్తుతం తెలుగు తమిళ సినిమాలతో ఎంతో బిజీగా ఉన్న ఈమె సోషల్ మీడియాలో కూడా అంతే చురుకుగా ఉంటూ తన అభిమానులను సందడి చేస్తుంటారు. కీర్తి సురేష్ సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటారు.
తాజాగా కీర్తి సురేష్ వరల్డ్ పిక్నిక్ డే అంటూ ఒక ఫోటోను షేర్ చేశారు. సాధారణంగా పిక్నిక్ అంటే లైఫ్ పార్టనర్ తో లేదా కుటుంబ సభ్యులతో కలిసి ఎంతో ఎంజాయ్ చేస్తారు. కానీ కీర్తి సురేష్ మాత్రం తనకెంతో ఇష్టమైన తన పెట్ నైక్తో కలిసి పిక్నిక్ డే ను ఎంజాయ్ చేస్తున్నటువంటి ఫోటోను షేర్ చేస్తూ.. ఇంతకంటే ఇంకేం కావాలి… సరైన పార్ట్నర్ తో ఉంటూ ఎంజాయ్ చేస్తున్నానని తెలిపారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం కీర్తి సురేష్ మహేష్ బాబు సరసన “సర్కారీ వారి పాట” చిత్రంలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అదేవిధంగా ఈమె నటించిన “గుడ్ లక్ సఖి”చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఈ చిత్రం ఓటీటీలో విడుదల కాబోతుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో చిత్ర బృందం స్పందించి ఈ సినిమాను ఎలాంటి పరిస్థితులలో కూడా ఓటీటీలో విడుదల చేయబోమని థియేటర్లోనే ఈ సినిమాను విడుదల చేస్తామని ప్రకటించారు.
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…
తమిళ నటుడు ఆర్. పార్థిబన్ చేసిన వ్యాఖ్యలకు గాను నటి త్రిష ఘాటుగా స్పందించింది. ఈ మేరకు త్రిష తన…
నటుడు జూనియర్ ఎన్టీఆర్ మార్చి 8, 2026న బెంగళూరులో నిర్వహించిన కిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.…
టాలీవుడ్ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నారు. తన ప్రియురాలు కావ్యతో ఆయన నిశ్చితార్థం ఆదివారం (మార్చి…
ఒత్తిడిని తగ్గించుకునేందుకు తాను ఫోన్నే కాదు, సోషల్ మీడియాను కూడా దూరంగా పెట్టానని, ఇప్పటికీ సామాజిక మాధ్యమాలను చూడడం లేదని…