షాకింగ్.. చేతబడి చేస్తున్నాడనే ఆరోపణతో మామను చంపిన అల్లుడు..!

September 12, 2021 5:28 PM

కేవలం చేతబడి చేస్తున్నాడన్న అనుమానం రావడంతో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. వరుసకు స్వయాన అల్లుడు అయినటువంటి వ్యక్తి చేతిలో మామ దారుణంగా హత్య చేయబడ్డాడు. ఈ విధంగా మామను హత్య చేసి ఎవరికీ అనుమానం రాకుండా రాత్రికి రాత్రి దహన సంస్కారాలు చేసిన ఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..

మక్కువ మండలం పనసభద్ర గ్రామంలో కేండ్రుక ఉత్తర(57) అనే వ్యక్తి పొలంలో పని చేస్తున్న తన భార్యకోసం భోజనం తీసుకుని వెళుతున్నాడు. అయితే తన మామ చేతబడి చేస్తూ తమ కుటుంబాన్ని నాశనం చేయదలచాడని, అదే గ్రామానికి చెందిన కొండ తామర నారప్ప అనే యువకుడు ఎలాగైనా తన మామకు బుద్ధి చెప్పాలని భావించాడు. ఈ క్రమంలోనే పొలం వద్దకు తన భార్యకు భోజనం తీసుకెళ్తున్న ఉత్తరను చంపడానికి ఇదే అనువైన సమయమని భావించిన నారప్ప అతనిని వెంబడించాడు.

ఈ క్రమంలోనే ఉత్తర తన చెర నుంచి తప్పించుకోవడానికి పరుగులు తీశాడు. ఇలా పరుగులు తీసిన తన మామను గ్రామానికి దూరంలో ఉన్న ఒక జీడి తోటలో తలపై బలంగా కొట్టడంతో ఉత్తర అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ క్రమంలోనే ఈ సంఘటనపై ఎవరికీ అనుమానం రాకుండా రాత్రికి రాత్రే తన మామకి దహన సంస్కరణలు నిర్వహించాడు. ఈ విధంగా తన తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేని అతని కుమారులు ఈ విషయాన్ని పోలీసులకు చేరవేయడంతో పోలీసులు విచారణ చేపట్టగా అసలు నిందితుడు బయటపడటంతో అతనిపై కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment