టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో భార‌త్‌ను ఓడిస్తాం.. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజ‌మ్‌.. ఓవ‌ర్ కాన్ఫిడెన్స్ అంటున్న నెటిజ‌న్లు..

September 4, 2021 10:55 AM

క‌రోనా కార‌ణంగా భార‌త్‌లో జ‌ర‌గాల్సిన ఐసీసీ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2021 ను యూఏఈలో నిర్వ‌హిస్తున్న విష‌యం విదిత‌మే. అక్టోబ‌ర్ 17 నుంచి న‌వంబ‌ర్ 14వ తేదీ వ‌ర‌కు ఆ టోర్నీ జ‌ర‌గనుంది. దీంతో ఆ టోర్నీలో జ‌ర‌గ‌నున్న భార‌త్‌, పాకిస్థాన్‌పై ఇప్ప‌టి నుంచే అంద‌రూ ర‌క‌ర‌కాలుగా స్పందిస్తున్నారు.

టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో భార‌త్‌ను ఓడిస్తాం.. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజ‌మ్‌.. ఓవ‌ర్ కాన్ఫిడెన్స్ అంటున్న నెటిజ‌న్లు..

టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ టోర్నీలో భాగంగా అక్టోబ‌ర్ 24న చిర‌కాల ప్ర‌త్య‌ర్థులు భార‌త్‌, పాకిస్థాన్‌లు త‌ల‌ప‌డ‌నున్నాయి. దుబాయ్‌లో ఈ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. దీంతో అంద‌రూ ఆ మ్యాచ్ కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. పాక్‌తో సంబంధాలు దెబ్బ తిన్నాక ఆ దేశం మ‌న ద‌గ్గ‌ర, మ‌న వాళ్లు అక్క‌డ మ్యాచ్‌ల‌ను ఆడ‌డం లేదు. కేవ‌లం ఐసీసీ టోర్న‌మెంట్‌ల‌లోనే పాక్‌తో భార‌త్ ఆడుతోంది. అయితే త్వ‌ర‌లో మ‌రో ఐసీసీ ఈవెంట్‌లో ఈ రెండు దేశాలూ త‌ల‌ప‌డ‌నుండ‌డంతో అభిమానులు అంద‌రూ ఎంతో ఆస‌క్తిగా ఆ మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నారు.

ఇక ఇదే విష‌యమై పాకిస్థాన్ కెప్టెన్ బాబ‌ర్ అజ‌మ్ స్పందిస్తూ.. ఈసారి టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ టోర్నీలో భార‌త్‌పై క‌చ్చితంగా గెలిచి తీరుతామని ధీమా వ్య‌క్తం చేశాడు. భార‌త్‌పై పైచేయి సాధిస్తామ‌న్నాడు. అక్టోబ‌ర్ 24న జ‌రిగే మ్యాచ్‌లో భార‌త్‌ను ఓడిస్తామ‌ని అన్నాడు.

అయితే భార‌త అభిమానులు మాత్రం బాబ‌ర్ అజ‌మ్ కామెంట్ల‌ను లైట్ తీసుకుంటున్నారు. భార‌త్ ను ఓడించ‌డం మీ వ‌ల్ల కాద‌ని, బాబ‌ర్ అజ‌మ్ మ‌రీ ఓవ‌ర్ కాన్ఫిడెన్స్‌తో మాట్లాడుతున్నాడ‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment