బచ్ పన్ కా ప్యార్ హై బుడ్డోడికి రూ.23 లక్షల విలువచేసే కారు బహుమతి..

August 13, 2021 1:27 PM

గత కొద్ది రోజుల క్రితం “బచ్ పన్ కా ప్యార్ హై” అంటూ ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం సుక్మా జిల్లాకు చెందిన హసదేవ్‌ డిర్డో అనే బాలుడు పాఠశాలలో ఈ పాటను పాడిన సంగతి మనకు తెలిసిందే. ఈ పాట ద్వారా ఓవర్ నైట్ స్టార్ అయిన ఈ బుడ్డోపై ప్రతి ఒక్కరూ ప్రశంసల వర్షం కురిపించారు. ఇక ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏకంగా ఈ బుడ్డోడిని పిలిపించుకొని మరి పాట పాడించుకుని విన్నారు. అదేవిధంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ కూడా ఈ పాట తనకు నిద్రలేకుండా చేస్తోందని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.

ఈ విధంగా ఈ పాటని ఎంతో అద్భుతంగా ఉండటంతో ఈ పాటకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాజాగా హసదేవ్‌కు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ బుడ్డోడు పాడిన పాటకు ఫిదా అయినటువంటి  ఎంజీ కంపెనీ ఆ బుడ్డోడికి ఏకంగా 23 లక్షల విలువచేసే కారును బహుమతిగా ఇచ్చినట్టు ఆ కారుకు సంబంధించిన కీస్ చిన్నారి చేతికి అందించినట్టు ఉన్నటువంటి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఈ క్రమంలోనే సదరు కంపెనీ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. ‘‘హసదేవ్‌ డిర్డో ఎంజీ కంపెనీ నిర్వహించిన ఓ డీలర్‌షిప్‌ఈ కార్యక్రమానికి వచ్చాడు ఈక్రమంలోనే కారు ముందు ఫోటో దిగారు అంతేకానీ తనకు ఎలాంటి కారు బహుమతిగా ఇవ్వలేదని సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని క్లారిటీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి వచ్చిన అందుకు గాను హసదేవ్‌ డిర్డో కి కేవలం ఇరవై ఒక్క వేల రూపాయలను బహుమతిగా ఇచ్చినట్లు కంపెనీ ప్రతినిధి వెల్లడించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment