రోజూ రూ.100 పొదుపుతో.. రూ.15 లక్షలు మీ సొంతం.!

August 9, 2021 5:49 PM

మీకు ఆడపిల్లలు ఉన్నారా..?వారి భవిష్యత్తు తరాల కోసం ఇప్పటి నుంచే డబ్బును పొదుపు చేయాలని భావిస్తున్నారా..? అయితే అలాంటి వారికి పంజాబ్ నేషనల్ బ్యాంక్ తమ ఖాతాదారులకు ఒక శుభవార్తను తెలియజేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ తమ ఖాతాదారులకు ఒకసారి కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ముఖ్యంగా ఈ పథకం ఆడ పిల్లల భవిష్యత్తు కోసం ఎంతగానో ఉపయోగపడుతుంది అని చెప్పవచ్చు.

ఈ పథకం ద్వారా ఒక కుటుంబంలో ఇద్దరు ఆడపిల్లలు ఉన్నప్పటికీ సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని ఓపెన్ చేసే ఈ పథకం ద్వారా పిల్లల పేరిట డబ్బులను ఆదా చేసుకోవచ్చు. ఈ పథకంలో ఏడాదికి 250 రూపాయల నుంచి లక్షా 50 వేల వరకు డిపాజిట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే ఖాతా తెరిచిన 15 సంవత్సరాల వరకు లబ్ధిదారుల ఖాతాలో ప్రీమియం అమౌంట్ ను డిపాజిట్ చేయవచ్చు. అయితే ఖాతా తెరిచిన నాటికి అమ్మాయి వయస్సు పది సంవత్సరాలకు మించి ఉండకూడదు.

ఈ ఖాతా ద్వారా డబ్బులు ఇన్వెస్ట్ చేసుకునే వారికి పన్ను మినహాయింపు ఉంటుంది. అదేవిధంగా బ్యాంకు 7.6 శాతం వడ్డీని కూడా అందిస్తుంది.ఈక్రమంలోనే ప్రతిరోజూ వంద చొప్పున నెలకు మూడు వేల రూపాయలు డిపాజిట్ చేయడం వల్ల మెచ్యూరిటీ కాలం ముగిసే సమయానికి లబ్ధిదారులు 15 లక్షలను పొందవచ్చు. మెచ్యూరిటీ కాలం 21 సంవత్సరాలు. ప్రతి యేటా 36 వేల రూపాయలను డిపాజిట్ చేయడం ద్వారా 14 సంవత్సరాలకు బ్యాంక్ అందిస్తున్న అటువంటి 7.6 శాతం వడ్డీతో కలిపి రూ .9,11,574 పొందవచ్చు అదే కనుక 21 సంవత్సరాలు వరకు ఉంటే ఏకంగా 15,22,221 లక్ష రూపాయలను పొందవచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment