నిరుద్యోగులకు శుభవార్త.. సికింద్రాబాద్ కంటోన్మెంట్ జోన్‌లో ఉద్యోగాలు..

August 5, 2021 10:24 PM

నిరుద్యోగులకు భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన టువంటి సికింద్రాబాద్ కంటోన్మెంట్ జోన్ శుభవార్తను తెలిపింది.ఈ క్రమంలోనే ఈ కంటెంట్మెంట్ జోన్ లో ఖాళీగా ఉన్నటువంటి 24 ఉద్యోగాలను భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ క్రమంలోనే ఖాళీగా ఉన్నటువంటి అసిస్టెంట్ కంటోన్మెంట్ ప్లానర్,మెడికల్ ఆఫీసర్, అసిస్టెంట్ ఇంజనీర్. నర్స్ విభాగాల్లో ఈ నియామకాలు చేపట్టారు.

బీటెక్ లేదా బిఈ చేసిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆయా విభాగాలను బట్టి విద్యార్హతలు ఉంటాయి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే ఆసక్తిగల అభ్యర్థులు కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలు దరఖాస్తు ప్రక్రియ అప్పుడే ప్రారంభమైంది.

ఆగస్టు 10వ తేదీలోగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజు ₹500 చెల్లించు కోవాలి. అయితే ఒక్కో విభాగానికి బట్టి వారి నెలవారి వేతనం ఉంటుంది. అభ్యర్థులను రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్థులు ఆగస్టు 10 లోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment