ఆ దర్శకుడితో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బాలయ్య బాబు ?

July 25, 2021 1:19 PM

డేటింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న పూరి జగన్నాథ్ సినిమాలు ఏ తరహాలో ఉంటాయో మనకు తెలిసిందే. పూరి సినిమాలలో హీరోలకు ప్రత్యేకమైన క్యారెక్టరైజేషన్, హీరోయిన్ కి డిఫరెంట్ రోల్ ఇచ్చి విభిన్న కథాంశంతో సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకుడిగా నిర్మాతగా మారిన సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా పాన్ ఇండియా చిత్రంగా “లైగర్” అనే సినిమాకు దర్శకత్వం, నిర్మాణ బాధ్యతలను చేపడుతున్నారు.

ఇకపోతే “లైగర్” తర్వాత పూరి తన తర్వాత ప్రాజెక్టుగా నందమూరి నటసింహం బాలకృష్ణతో చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే బాలకృష్ణకు కథ చెప్పడంతో కథ వినగానే బాగా నచ్చడంతో ఈ సినిమాలో చేయడానికి బాలయ్య బాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. వీరిద్దరి కాంబోలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇడియట్ తరహాలో ఉండబోతోందని తెలుస్తోంది. తండ్రీ కొడుకుల మధ్య సాగే ఈ కథలో కొడుకు గెలుపు కోసం తండ్రి ఏం చేశాడు అనే లైన్ ఆధారంగా సినిమా తెరకెక్కబోతోందని తెలుస్తోంది.

ప్రస్తుతం పూరి “లైగర్ ” సినిమాతో బిజీగా ఉండగా.. బాలయ్య బాబు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న “అఖండ” సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో మొట్టమొదటిసారిగా బాలయ్య బాబు త్విపాత్రాభినయం చేయనున్నారు. అయితే గతంలో పూరి, బాలకృష్ణ కాంబినేషన్ లో తెరకెక్కిన “పైసా వసూల్”చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టినా, ప్రేక్షకులలో మాత్రం మంచి క్రేజ్ సంపాదించింది.తరువాత వీరి కాంబోలో రాబోయే ప్రాజెక్ట్ ఈ ఏడాది వేసవిలో ప్రారంభం కాబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment