వచ్చే నాలుగు వారాలు జాగ్రత్త.. లేదంటే ప్రాణాలకే ముప్పు!

April 7, 2021 12:55 PM

ప్రస్తుతం దేశం మొత్తం కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతున్న నేపథ్యంలో రోజు రోజుకి దేశ వ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇరవై రోజుల క్రితం వరకు దేశం మొత్తం కేవలం లక్ష వరకు యాక్టివ్ కేసులు ఉండగా ఈ 20 రోజులలో యాక్టివ్ కేసుల సంఖ్య ఏకంగా 8 లక్షలు దాటింది. అదేవిధంగా మరణాల సంఖ్య కూడా పెరగడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది.

ఈ విధంగా కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతుండటంతో ఇప్పటికే పలు రాష్ట్రాలలో కరోనా ఆంక్షలను కట్టుదిట్టం చేశారు. పాజిటివ్ కేసులు అధికంగా ఉన్న రాష్ట్రాలలో మరింత కఠినమైన ఆంక్షలు విధించే అవకాశాలు ఉన్నాయని ఈ మహమ్మారిపై కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తుంది.

రాబోయే నాలుగు వారాలలో కరోనా పరిస్థితి మరింత భయంకరంగా ఉంటుందని, ఈ విషయంలో ప్రతి ఒక్కరూ ఎంతో జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. నిర్లక్ష్యం వహించకుండా కరోనా జాగ్రత్తలు పాటిస్తే తప్పకుండా ఈ మహమ్మరి నుంచి బయటపడోచ్చని కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నప్పటికీ కొందరు 18 సంవత్సరాల వయస్సు నిండిన వారందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో, అందరికీ వ్యాక్సిన్ ఇవ్వడం సాధ్యం కాదని,ప్రస్తుతం అవసరమైన వారికి మాత్రమే వ్యాక్సిన్ ఇస్తున్నట్లు అధికారులు తెలియజేశారు

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment