Roja : భ‌ర్త వ‌ల్ల కోట్లు న‌ష్ట‌పోయిన రోజా.. త‌రువాత ఆమె ఎలా బ‌య‌ట ప‌డిందంటే..?

September 17, 2022 12:18 PM

Roja : 1990 దశాబ్దంలో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ లో మంచి క్రేజ్ ఉన్న తారలలో రోజా కూడా ఒకరు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో హీరోయిన్ గా నటించి రోజా అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకుంది. అంతే కాకుండా అప్పటి స్టార్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ వంటి వారితో కలిసి ఎన్నో చిత్రాల్లో  నటించింది. తెలుగుతోపాటు త‌మిళంలో కూడా రోజాకి మంచి ఫాలోయింగ్ ఉంది. తమిళంలో కూడా రోజా ఎన్నో సక్సెస్‌ఫుల్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుంది. కేవలం హీరోయిన్ గానే కాకుండా లేడీ ఓరియెంటెడ్ సమ్మక్క సారక్క వంటి సినిమాల్లో కూడా రోజా అదరగొట్టింది.

రోజా ఏపీలోని చిత్తూరు జిల్లాలో జన్మించారు.  తిరుపతి పద్మావతి మహిళా యునివర్సిటీలోనే చదువుకున్నారు. అంతే కాకుండా నాగార్జున యునివర్సిటీలో పొలిటికల్ సైన్స్ లో పీజీ పూర్తి చేశారు. చదువుకునే టైంలోనే నటన పై ఉన్న మక్కువతో రోజా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. తన నటన పరంగా ఎన్నో అవార్డులను దక్కించుకుంది రోజా. దివంగ‌త మాజీ ఎంపీ శివ‌ప్ర‌సాద్.. రోజాకు సినిమాల్లో ఆమెకు గురువు. రోజా అసలు పేరు శ్రీలత రెడ్డి. ఆమె పేరును రోజాగా మార్చింది కూడా శివ‌ప్ర‌సాదే.

Roja lost crores of rupees because of her husband
Roja

2002 లో రోజా తమిళ దర్శకుడు ఆర్ కే సెల్వామణిని ప్రేమించి వివాహం చేసుకున్నారు. సెల్వమణి  వివాహం  చేసుకున్న  తరవాత రోజాకు సినిమా అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. దాంతో రోజా సొంతంగా ప్రొడక్షన్ కంపెనీ స్థాపించారు. తన ప్రొడక్షన్ లోనే భర్త దర్శకుడిగా అనేక చిత్రాలను నిర్మించారు. ఈ సినిమాలు తీయటం కోసం రోజా తాను ఆరు సినిమాలకు తీసుకున్న రెమ్యునరేషన్ మొత్తాన్ని ఖర్చు చేశారట.

అయితే సొంతంగా తీసిన మూడు సినిమాలకు మంచి టాక్ వచ్చినా ఆశించిన మేరకు మంచి ఫలితాలు అందుకోలేకపోయాయి. దాంతో ఆ సినిమాలకు నష్టాలను చవి చుడాల్సి వచ్చింది. అలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సమయంలోనే రోజా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 2004, 2009 సంవత్సరాల్లో నగరి, చంద్రగిరి నియజకవర్గాల నుండి పోటీ చేసి ఓడిపోయారు రోజా. ఈ క్రమంలో రోజా ఆర్థికంగా మరింత నష్టపోయారు.

ఇక 2013 లో జబర్ద‌స్త్ కామెడీ షో ప్రారంభం కాగా ఆ షో లో జడ్జి గా బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చారు. జబర్దస్త్ షో ప్రేక్షకులలో మంచి ఆదరణ పొందడంతో ఈ షోకి జడ్జిగా వ్యవహరిస్తున్న రోజాకి మల్లెమాల సంస్థ ద్వారా అత్యధికంగా పారితోషికం అందింది. రోజా ఆర్థికంగా నిలదొక్కుకోవడంలో జబర్దస్త్ షో  కీల‌క పాత్ర పోషించింద‌ని చెప్పవచ్చు. ప్రస్తుతం రోజా మంత్రి పదవి లో తన పని తాను సక్రమంగా చేస్తూ ముందుకు వెళుతుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now