Singer Shruti : ఆచార్య సినిమాలో నటించిన ఈమె ఎవరో తెలుసా..?

May 30, 2022 7:08 PM

Singer Shruti : కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్‌ చిరంజీవి, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ తేజ ప్రధాన పాత్రల్లో వచ్చిన మూవీ.. ఆచార్య. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించారు. పూజా హెగ్డె ఇంకో కీలక పాత్రలో నటించింది. అయితే ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకుంది. ఓటీటీలోనూ ఈ మూవీకి వ్యూస్‌ అసలు రావడం లేదు. మెగాస్టార్‌ సినిమా కెరీర్‌లోనే అతి పెద్ద ఫ్లాప్‌గా ఈ మూవీ రికార్డు క్రియేట్‌ చేసింది. ఈ మూవీకి ఏకంగా రూ.84 కోట్లు నష్టం వచ్చిందని ట్రేడ్‌ పండితులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే తమను ఆదుకోవాలంటూ డిస్ట్రిబ్యూటర్లు కోరగా.. రామ్‌ చరణ్ హామీ ఇచ్చారు.

ఇక ఈ మూవీలో మెగాస్టార్‌ చిరంజీవితో కలిసి కొన్ని సీన్లలో ఓ అమ్మాయి నటించింది గుర్తుంది కదా. ఈ మూవీలో ఆమె ఘట్టమ్మగా నటించి ఆకట్టుకుంది. అయితే ఆమె సింగర్‌ ఎంఎల్‌ శృతి. ఈమె చిరంజీవి పక్కన స్క్రీన్‌ను షేర్‌ చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని తెలియజేసింది. ఈ మేరకు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ పెట్టింది. తనకు చిన్నప్పటి నుంచి చిరంజీవి అంటే ఇష్టమని, ఆయన సినిమాలు చూస్తూ పెరిగానని.. అయితే ఇప్పుడు ఆయన పక్కనే నటించే చాన్స్‌ వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపింది. ఆ సీన్లలో నటిస్తున్నప్పుడు షూటింగ్‌ గ్యాప్‌లో ఆయనతో మాట్లాడడం చాలా ఆనందంగా ఉందని చెప్పింది.

Singer Shruti told about Chiranjeevi and Acharya movie
Singer Shruti

తనకు ఈ సినిమాలో నటించేందుకు అవకాశం ఇచ్చినందుకు దర్శకుడు కొరటాల శివకు శృతి ధన్యవాదాలు తెలియజేసింది. ఇక టాలీవుడ్‌లో చక్కని సింగర్‌గా శృతి మంచి పేరు తెచ్చుకుంది. బాలకృష్ణ హీరోగా వచ్చిన అఖండ మూవీలో ఈమె అడిగా అడిగా అనే పాట పాడింది. కాగా ఈమె నటుడు జయంత్‌ని పెళ్లి చేసుకుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment