1 ల‌క్ష డోసుల కోవాగ్జిన్ వ్యాక్సిన్‌ల‌ను ప‌రాగ్వేకు పంపిన భార‌త్

March 30, 2021 11:47 AM

క‌రోనా నేప‌థ్యంలో దేశ‌వ్యాప్తంగా కోవిడ్ టీకాల పంపిణీ కార్య‌క్ర‌మం చురుగ్గా కొన‌సాగుతోంది. అయితే క‌రోనా సెకండ్ వేవ్ ప్ర‌భావం అంద‌రినీ క‌ల‌వ‌ర‌పెడుతోంది. అయిన‌ప్ప‌టికీ వ్యాక్సిన్ల పంపిణీ ప్ర‌క్రియ నిరంత‌రాయంగా కొన‌సాగుతూనే ఉంది. ఈ క్ర‌మంలోనే దేశంలో కోవిషీల్డ్‌, కోవాగ్జిన్ ల‌ను ప్ర‌జ‌ల‌కు ఇస్తున్నారు. కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను బ్రిట‌న్‌కు చెందిన ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీ, ఆస్ట్రాజెనెకా కంపెనీలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. కోవాగ్జిన్‌ను దేశంలోని భార‌త్ బ‌యోటెక్ సంస్థ రూపొందించింది.

india sent 1 lakh doses of covaxin vaccine to Paraguay

కాగా కోవిషీల్డ్‌, కోవాగ్జిన్‌ల‌ను ప్ర‌స్తుతం భార‌త్ ఇత‌ర దేశాల‌కు కూడా ఎగుమ‌తి చేస్తోంది. అందులో భాగంగానే తాజాగా 1 ల‌క్ష డోసుల కోవాగ్జిన్ టీకాల‌ను పరాగ్వేకు పంపించారు. ఆ డోసులను ఆ దేశం స్వీక‌రించింది. ఈ వివ‌రాల‌ను విదేశీ వ్య‌వ‌హారాల మంత్రి ఎస్‌.జై శంక‌ర్ ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించారు. మేడిన్ ఇండియా వ్యాక్సిన్ ప‌రాగ్వేకు చేరుకుంద‌ని తెలిపారు.

పరాగ్వేలో ఇప్ప‌టి వ‌ర‌కు 2,09,000 కోవిడ్ కేసులు న‌మోద‌య్యాయి. అలాగే 4063 మంది అక్క‌డ చ‌నిపోయారు. భార‌త్ కేవ‌లం ప‌రాగ్వేకు మాత్ర‌మే కాకుండా ఇప్ప‌టి వ‌ర‌కు ప‌లు ఇత‌ర దేశాల‌కు కూడా కోవిడ్ టీకా డోసుల‌ను పంపిస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 638.81 ల‌క్ష‌ల వ్యాక్సిన్ డోసుల‌ను భార‌త్ ఇతర దేశాల‌కు పంపించింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment