భయపెడుతున్న బ్లాక్ ఫంగస్.. కన్ను, దవడ తొలగించిన దక్కని ప్రాణం.. ఎక్కడంటే?

May 19, 2021 8:49 PM

భయంకరమైన కరోనా మహమ్మారి బారిన పడి దేవుడి దయవల్ల బతికి బట్ట కడుతుంటే బ్లాక్ ఫంగస్ రూపంలో మృత్యువు మరోసారి వెంటాడుతోంది. కరోనా నుంచి పోరాడి బయటపడిన వారు బ్లాక్ ఫంగస్ వల్ల మరణిస్తున్నారు. ఫంగస్ ఏర్పడటం వల్ల కళ్ళు, దవడ, ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్ కి గురవుతున్నాయి.ఈ క్రమంలోనే ఎంతో మంది చూపును కోల్పోవడమే కాకుండా కొన్ని చోట్ల మరణాలు కూడా సంభవిస్తున్నాయి.

తాజాగా తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో రామారెడ్డి మండలం గిద్ద గ్రామానికి చెందిన 42సంవత్సరాల గురజాల అంజల్ రెడ్డి బ్లాక్ ఫంగస్ తో మృతి చెందాడు. గత నెల 22న కరోనా బారిన పడిన అంజల్ రెడ్డికి నిజామాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందించారు. ఈ నెల 10వ తేదీన అతని పరిస్థితి విషమించడంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.

అంజల్ రెడ్డికి కరోనాతో పాటు బ్లాక్ ఫంగస్ సోకడంతో ఈనెల 11వ తేదీన అతని దవడ, కన్నును వైద్యులు తొలగించారు. దీంతో అంజల్ రెడ్డి హైదరాబాద్ లో చికిత్స తీసుకుంటూనే ఆదివారం మృతి చెందాడు. ఈ విధంగా వల్ల మరణించడంతో ప్రజలలో మరింత భయాందోళనలు కలుగుతున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment