Disha Patani : రెచ్చిపోయిన దిశా.. ఖజుర‌హో శిల్పానికే అసూయ పుట్టిస్తుందిగా..!

డిసెంబర్ 30, 2021 9:37 సా.

Disha Patani : బాలీవుడ్ నటి దిశా పటానీ తన బోల్డ్‌నెస్‌తో నెటిజ‌న్స్‌కి పిచ్చెక్కిస్తోంది. సోష‌ల్ మీడియాలో ఈ అమ్మ‌డు చేసే ర‌చ్చ వేరే లెవ‌ల్‌లో ఉంటోంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ‌ మాల్దీవుల్లో వెకేషన్‌ ను ఎంజాయ్‌ చేస్తోంది. 2021 ఇయర్‌ ఎండింగ్‌ హాలీడేస్‌ కోసం మాల్దీవులకు చెక్కేసింది. అక్కడ బికినీ పోజులిస్తూ రెచ్చిపోయింది. నీలిసముద్రంలో అందాల విందు చేస్తూ దిగిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుంది.

Disha Patani latest photos trending

ఖ‌జుర‌హో శిల్పానికే అసూయ పుట్టేలే దిశా కనిపిస్తూ రెచ్చిపోతోంది. ఈ అమ్మ‌డి గ్లామ‌ర్ షోని వ‌ర్ణించ‌డానికి మాట‌లే లేవు అంటూ నెటిజ‌న్స్ కామెంట్స్ పెడుతున్నారు. తెలుగులో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన లోఫర్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయింది. ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు, వెంటనే బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ భామ అక్కడ అయితే వరుస అవకాశాలను దక్కించుకుంది.

దిశా పటానీ బాలీవుడ్‌లో `ఎంఎస్‌ ధోని`, `కుంగ్‌ ఫూ యోగా`, `బాఘి2`, `భరత్‌`, `మంగల్‌` చిత్రాల్లో నటించింది. `బాఘి2` చిత్రంతో బంపర్‌ హిట్‌ ని అందుకుని బాలీవుడ్‌లో పాపులారిటీని సొంతం చేసుకుంది. యంగ్‌ సెన్సేషన్‌గా మారింది దిశా. బాఘి3`తో మరో హిట్‌ని తన ఖాతాలో వేసుకుంది. ఇందులో ఆమె జస్ట్ స్పెషల్‌ సాంగ్‌లోనే మెరవడం విశేషం. `భరత్‌` చిత్రంలో సల్మాన్‌తో కలిసి నటించింది. ఈమె సినిమాలే కాదు సోష‌ల్ మీడియాలో షేర్ చేసే ఫొటోలు కూడా సెన్సేష‌నల్‌గా నిలుస్తున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment