మీకు కరోనా పాజిటివ్ అని తెలిస్తే ఏం చేయాలి? ఏం చేయకూడదో తెలుసా?

April 25, 2021 10:31 PM

కరోనా వైరస్ దేశవ్యాప్తంగా విస్తృత స్థాయిలో వ్యాపిస్తున్న నేపథ్యంలో రోజురోజుకు కేసుల సంఖ్య పెరగడంతో చాలా మంది ఆసుపత్రి పాలవుతున్నారు. ఈ క్రమంలోనే ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలు అందక పోవడంతో ఎంతోమంది ఎన్నో అవస్థలు పడుతున్నారు. అయితే కరోనా పాజిటివ్ అని తెలిసిన వెంటనే ఆస్పత్రికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటూ వైద్యుల సలహాలు సూచనలను పాటిస్తూ, వ్యాధి బారి నుంచి బయటపడవచ్చు కరోనా వైరస్ సోకినప్పుడు ఇంట్లోనే ఉంటూ ఎటువంటి పనులను చేయాలి.. ఏం చేయకూడదో ఇక్కడ తెలుసుకుందాం..

చేయాల్సిన పనులు:

* కరోనా పాజిటివ్ అని తెలిసిన వెంటనే ఒక ప్రత్యేక గదిలో ఉంటూ ఎల్లప్పుడు మాస్కు ధరించి మన గది లోనికి ఇతర కుటుంబ సభ్యులు ప్రవేశించకుండా చూడాలి.

* కరోనా పాజిటివ్ అని తేలినప్పుడు బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలి. తేలికపాటి లక్షణాలు కనిపిస్తే పారాసెట్మాల్ ఉపయోగించాలి. అదేవిధంగా తరచూ ఆక్సిజన్ స్థాయిలను ఆక్సీమీటర్ ద్వారా గమనిస్తూ వుండాలి.

*ఎక్కువగా ద్రవ ఆహార పదార్థాలను తీసుకోవాలి. రోజుకు ఎనిమిది నుంచి పది గ్లాసుల నీటిని తాగాలి.
*తరచుగా చేతులను శానిటైజర్ చేస్తూ మాస్కు ధరించి ఉండాలి.

చేయకూడని పనులు:

* కరోనా తేలికపాటి లక్షణాలు ఉంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎటువంటి మందులను ఉపయోగించకూడదు.

* లక్షణాలు అధిక స్థాయిలో ఉండి, ఆక్సిజన్ స్థాయిలు పడిపోతూ ఉంటే వెంటనే వైద్యుని సంప్రదించాలి.

*వాడిన మాస్క్ లను మళ్లీ మళ్లీ వాడకూడదు. సొంత వైద్యం పనికిరాదు.

* కోవిడ్ లక్షణాలు ఉన్నవారు కేవలం ఒక గదిలోకి మాత్రమే పరిమితమై ఉండాలి బయటకు రావడం ఇతరులతో మాట్లాడటం చేయకూడదు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment