Samantha : పరువు నష్టం కేసులో సమంతకు షాక్ ఇచ్చిన కోర్ట్..!

October 22, 2021 12:16 PM

Samantha : గత కొద్ది రోజులుగా సమంత గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై ఆమె కూకట్ పల్లి కోర్టులో పలు యూట్యూబ్ ఛానల్స్‌పై పరువు నష్టం దావా పిటిషన్ వేసింది. ఈ క్రమంలోనే ఈ పిటిషన్ పై కోర్టు విచారణ జరపగా ఈ విచారణలో భాగంగా సమంతకు కోర్టు నుంచి నిరాశ ఎదురైందని చెప్పవచ్చు. విడాకులు తీసుకున్న తర్వాత తనని అప్రతిష్టపాలు చేస్తున్నారని సమంత పరువు నష్టం దావా పిటిషన్ వేసింది.

court given shock to Samantha in defamation case

అయితే గురువారం ఈ పిటిషన్ పై విచారణ చేపట్టగా.. కోర్టు తీర్పును శుక్రవారంకు వాయిదా వేసింది. గురువారం కోర్టు సమయం ముగియడంతో తీర్పును వెల్లడించక పోవడమే కాకుండా సమంతా పిటిషన్ పై చురకలు అంటించింది. పరువు నష్టం దావా కింద పిటిషన్ వేసిన తర్వాత తను క్షమాపణ కోరాలి కానీ ఇలా డబ్బులను డిమాండ్ చేయడం ఏంటి అంటూ ప్రశ్నించింది.

ఇలా సమంత పిటిషన్ ను అత్యవసరంగా విచారించడానికి కుదరదని కోర్టు స్పష్టం చేసింది. అయితే సమంత నటిగా ఎంతో బిజీగా ఉండడం వల్ల ఆమె పిటిషన్ ను ఎమర్జెన్సీ కింద విచారించాలని సమంత తరపున న్యాయవాది బాలాజీ కోర్టుకు విన్నవించారు.

ఆయన వాదనను విన్న తర్వాత కూకట్ పల్లి న్యాయమూర్తి కోర్టుకు అందరూ సమానమేనని, ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ అన్న భావన ఇక్కడ ఉండదని అన్నారు. సమంత కేసును అత్యవసర కేసుగా భావించి త్వరగా విచారించమని కోరడం కరెక్ట్‌ కాదని, అందరూ చట్టం ముందు సమానమేనని, ఇతర పరువు నష్టం కేసుల్లాగే ఈ కేసును కూడా విచారిస్తామని, మొత్తం ప్రొసీజర్ ప్రకారమే ఫాలో అవుతామని.. న్యాయస్థానం వెల్లడించింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment