ఐపీఎల్ 2021: చెన్నై ఖాతాలో మ‌రో విజ‌యం.. కోల్‌క‌తాపై గెలుపు..

April 21, 2021 11:27 PM

ముంబైలో జ‌రిగిన ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2021 టోర్నీ 15వ మ్యాచ్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ విజ‌యం సాధించింది. చెన్నై నిర్దేశించిన భారీ ల‌క్ష్యాన్ని కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ ఓ ద‌శ‌లో ఛేదించేట‌ట్లే క‌న‌బ‌డింది. కానీ ఎప్ప‌టిక‌ప్పుడు వికెట్ల‌ను కోల్పోతూ వ‌చ్చింది. దీంతో కోల్‌క‌తాపై చెన్నై 18 ప‌రుగుల తేడాతో గెలుపొందింది.

chennai won by 18 runs against kolkata in ipl 2021 15th match

మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోల్‌కతా ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా చెన్నై బ్యాటింగ్ చేప‌ట్టింది. ఈ క్ర‌మంలో చెన్నై నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 3 వికెట్ల న‌ష్టానికి 220 ప‌రుగులు చేసింది. చెన్నై బ్యాట్స్‌మెన్ల‌లో డుప్లెసిస్‌, రుతురాజ్ గైక్వాడ్‌లు అద్భుతంగా రాణించారు. 60 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స‌ర్ల‌తో డుప్లెసిస్ 95 ప‌రుగులు చేసి నాటౌట్‌గా నిల‌వ‌గా 42 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స‌ర్ల‌తో రుతురాజ్ గైక్వాడ్ 64 ప‌రుగులు చేశాడు. కోల్‌క‌తా బౌల‌ర్ల‌లో వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి, సునీల్ న‌రైన్‌, ఆండ్రు ర‌స్సెల్‌ల‌కు త‌లా 1 వికెట్ ద‌క్కింది.

అనంత‌రం బ్యాటింగ్ చేప‌ట్టిన కోల్‌క‌తా 19.1 ఓవ‌ర్ల‌లో ఆలౌట్ అయింది. 202 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. కోల్‌క‌తా బ్యాట్స్‌మెన్ల‌లో ప్యాట్ క‌మ్మిన్స్ 34 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స‌ర్ల‌తో 66 ప‌రుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఆండ్రు ర‌స్సెల్ 22 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్స‌ర్ల‌తో 54 ప‌రుగులు చేయ‌గా, దినేష్ కార్తీక్ 24 బంత‌ల్లో 4 ఫోర్లు, 2 సిక్స‌ర్ల‌తో 40 ప‌రుగులు చేశాడు. చెన్నై బౌల‌ర్ల‌లో దీపక్ చాహ‌ర్ 4 వికెట్లు, లుంగి ఎంగిడిలు 3 వికెట్లు ప‌డ‌గొట్టారు. శామ్ కుర్రాన్‌కు 1 వికెట్ ద‌క్కింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment