Viral Video : ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ప్రభావం అందరిలోనూ ఎలా ఉందో అందరికీ తెలిసిందే. ఆ మాయలో పడి కొందరు ప్రాణాలనే పోగొట్టుకుంటున్నారు. రీల్స్ పేరు చెప్పి సాహసాలు చేస్తూ లోయల్లో పడి ప్రాణాలను కోల్పోతున్నారు. అయితే ఆ వ్యక్తి అంతటి సాహసం చేయలేదు కానీ సోషల్ మీడియాలో ఫాలోవర్లు, లైకుల కోసం అత్యంత చెత్త పని చేశాడు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
యూట్యూబర్ అయిన పవర్ హర్ష అలియాస్ మహాదేవ్ అనే వ్యక్తి హైదరాబాద్ లోని కూకట్పల్లిలో నడిరోడ్డుపై బైక్ పై వెళ్తూ రోడ్డు మీద కరెన్సీ నోట్లను వెదజల్లాడు. మరో చోట కూడా రోడ్డు మధ్యలో నిలబడి అదే పని చేశాడు. రోడ్డు మధ్యలో నిలుచుని కరెన్సీ నోట్లను ధాన్యం చల్లినట్లు చల్లాడు. అయితే డబ్బును అలా చూసే సరికి వాహనదారులు, పాదచారులు ఆ డబ్బును ఏరుకునేందుకు ఎగబడ్డారు. దీంతో దొరికినోళ్లకు దొరికినంత డబ్బు వచ్చింది.
అయితే మహాదేవ్ మొత్తంగా అలా రూ.50వేలను వెదజల్లినట్లు తెలిసింది. కానీ అతని వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అత్యంత రద్దీగా ఉండే రోడ్లపై అలా డబ్బులను విసిరితే వాటిని ఏరుకునేందుకు జనాలు ఎగబడితే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సోషల్ మీడియాలో సబ్స్క్రైబర్లను పెంచుకునేందుకు అతను ఇలా చేయడం కరెక్ట్ కాదని, ఎవరికైనా ఏదైనా జరిగి ఉంటే బాధ్యత ఎవరు తీసుకుంటారు.. అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కంటెంట్ క్రియేట్ చేసేందుకు ఇలాంటి దారి ఎంచుకోవడం సరికాదని అంటున్నారు. వెంటనే ఆ వ్యక్తిపై పోలీసులు కేసు పెట్టి చర్యలు తీసుకోవాలని అతని వీడియోలను పోలీసులకు ట్యాగ్ కూడా చేస్తున్నారు.
అయితే ఆ వ్యక్తిపై ఇప్పటి వరకు పోలీసులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కానీ యూట్యూబ్లో ఫేమస్ అవడం కోసమే అతను ఇలా చేస్తున్నట్లు వెల్లడించాడు. తాను రానున్న రోజుల్లో కూడా ఇలాగే చేస్తానని, రోడ్డు మీద తాను ఎంత డబ్బును వెదజల్లుతాడో కచ్చితంగా చెప్పేవారికి మంచి రివార్డులను కూడా ఇస్తానని అతను చెప్పడం విశేషం. మరి పోలీసులు ఈ విషయంపై దృష్టి సారిస్తారో లేదో చూడాలి.
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…
భారత్, శ్రీలంకలో ఫిబ్రవరి 7వ తేదీ నుంచి జరగనున్న టీ20 వరల్డ్కప్ 2026 జట్టులో తనకు చోటు దక్కకపోవడంపై భారత…
ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం హైబీపీ అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. చాలా మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. కొందరికి…