Biryani : ఈమధ్య కాలంలో ఎక్కడ చూసినా రెస్టారెంట్లు వెలుస్తున్నాయి. చిన్నపాటి రెస్టారెంట్లను ఓపెన్ చేసి మరీ కస్టమర్లకు పసందైన విందు భోపనాలను వడ్డిస్తున్నారు. ఈ ట్రెండ్ గతంలో నగరాల్లో మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు పట్టణాలు, పల్లెలకు సైతం పాకింది. ఈ క్రమంలోనే రెస్టారెంట్ ఓనర్లు కస్టమర్లను ఆకర్షించేందుకు అనేక ఆఫర్లను కూడా అందిస్తున్నారు. అయితే ఇలాగే అక్కడ కూడా ఓ రెస్టారెంట్ యజమాని తమ బిర్యానీ పబ్లిసిటీ కోసం తాజాగా ఓ వినూత్నమైన కాంపిటీషన్ను నిర్వహించాడు. దీనికి అక్కడి ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన కూడా లభించింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
తమిళనాడులోని కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ సమీపంలో చీ ఫుడ్ ఎక్స్ప్రెస్ అనే రెస్టారెంట్ను రీసెంట్గా ఓపెన్ చేశారు. కోయంబత్తూర్ రైల్వే స్టేషన్లోని ఓ కోచ్ను తీసుకువచ్చి దాన్ని రెస్టారెంట్గా మార్చారు. అయితే కస్టమర్లను ఆకర్షించేందుకు ఆ రెస్టారెంట్ యజమాని ఓ కాంపిటీషన్ను పెట్టాడు. 6 బిర్యానీలను తిన్నవారికి రూ.1 లక్ష నగదు బహుమతిని అందిస్తామని ప్రకటించాడు.
అలాగే 4 బిర్యానీలను తిన్నవారికి రూ.50వేలు, 3 బిర్యానీలను తిన్నవారికి రూ.25 వేలు ఇస్తామని అనౌన్స్ చేశారు. దీంతో ఊహించినదాని కన్నా ఎక్కువగా కస్టమర్లు ఆ రెస్టారెంట్కు పోటెత్తారు. సుమారుగా 1000 మందికి పైగాఈ కాంపిటీషన్లో పాల్గొన్నారు. అయితే వారు ఎవరూ బిర్యానీలను తినలేకపోయారు. మధ్యాహ్నం 1 గంటకు కాంపిటీషన్ మొదలవ్వగా సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. చివరకు మూర్తి అనే ఒక వ్యక్తి మాత్రం 4 బిర్యానీలను తిన్నాడు. దీంతో అతనికి రెస్టారెంట్ యాజమాన్యం రూ.50వేలను అందజేసింది.
అయితే సదరు వ్యక్తి కొడుకు ఆటిజంతో బాధపడుతున్నాడట. అతని మెడికల్ ఖర్చుల కోసమే తాను ఈ కాంపిటీషన్లో పాల్గొన్నానని చెప్పడం అందరినీ కలచివేసింది. ఏది ఏమైనా ఆ రెస్టారెంట్కు మాత్రం ఇప్పుడు కస్టమర్లు పోటెత్తుతున్నారు. వ్యాపారం చేయాలనే ఐడియా ఉండాలే కానీ ఇలాంటి ట్రిక్స్ను ఎన్నో పాటించి లాభాలను సంపాదించవచ్చు.
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…
తమిళ నటుడు ఆర్. పార్థిబన్ చేసిన వ్యాఖ్యలకు గాను నటి త్రిష ఘాటుగా స్పందించింది. ఈ మేరకు త్రిష తన…
నటుడు జూనియర్ ఎన్టీఆర్ మార్చి 8, 2026న బెంగళూరులో నిర్వహించిన కిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.…
టాలీవుడ్ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నారు. తన ప్రియురాలు కావ్యతో ఆయన నిశ్చితార్థం ఆదివారం (మార్చి…
ఒత్తిడిని తగ్గించుకునేందుకు తాను ఫోన్నే కాదు, సోషల్ మీడియాను కూడా దూరంగా పెట్టానని, ఇప్పటికీ సామాజిక మాధ్యమాలను చూడడం లేదని…
విశ్వక్ సేన్, కయాదు లోహర్ హీరో హీరోయిన్లుగా థియేటర్లలో రిలీజ్ అయిన ఫంకీ మూవీ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్కు రెడీ…