Biryani : ఈమధ్య కాలంలో ఎక్కడ చూసినా రెస్టారెంట్లు వెలుస్తున్నాయి. చిన్నపాటి రెస్టారెంట్లను ఓపెన్ చేసి మరీ కస్టమర్లకు పసందైన విందు భోపనాలను వడ్డిస్తున్నారు. ఈ ట్రెండ్ గతంలో నగరాల్లో మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు పట్టణాలు, పల్లెలకు సైతం పాకింది. ఈ క్రమంలోనే రెస్టారెంట్ ఓనర్లు కస్టమర్లను ఆకర్షించేందుకు అనేక ఆఫర్లను కూడా అందిస్తున్నారు. అయితే ఇలాగే అక్కడ కూడా ఓ రెస్టారెంట్ యజమాని తమ బిర్యానీ పబ్లిసిటీ కోసం తాజాగా ఓ వినూత్నమైన కాంపిటీషన్ను నిర్వహించాడు. దీనికి అక్కడి ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన కూడా లభించింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
తమిళనాడులోని కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ సమీపంలో చీ ఫుడ్ ఎక్స్ప్రెస్ అనే రెస్టారెంట్ను రీసెంట్గా ఓపెన్ చేశారు. కోయంబత్తూర్ రైల్వే స్టేషన్లోని ఓ కోచ్ను తీసుకువచ్చి దాన్ని రెస్టారెంట్గా మార్చారు. అయితే కస్టమర్లను ఆకర్షించేందుకు ఆ రెస్టారెంట్ యజమాని ఓ కాంపిటీషన్ను పెట్టాడు. 6 బిర్యానీలను తిన్నవారికి రూ.1 లక్ష నగదు బహుమతిని అందిస్తామని ప్రకటించాడు.
అలాగే 4 బిర్యానీలను తిన్నవారికి రూ.50వేలు, 3 బిర్యానీలను తిన్నవారికి రూ.25 వేలు ఇస్తామని అనౌన్స్ చేశారు. దీంతో ఊహించినదాని కన్నా ఎక్కువగా కస్టమర్లు ఆ రెస్టారెంట్కు పోటెత్తారు. సుమారుగా 1000 మందికి పైగాఈ కాంపిటీషన్లో పాల్గొన్నారు. అయితే వారు ఎవరూ బిర్యానీలను తినలేకపోయారు. మధ్యాహ్నం 1 గంటకు కాంపిటీషన్ మొదలవ్వగా సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. చివరకు మూర్తి అనే ఒక వ్యక్తి మాత్రం 4 బిర్యానీలను తిన్నాడు. దీంతో అతనికి రెస్టారెంట్ యాజమాన్యం రూ.50వేలను అందజేసింది.
అయితే సదరు వ్యక్తి కొడుకు ఆటిజంతో బాధపడుతున్నాడట. అతని మెడికల్ ఖర్చుల కోసమే తాను ఈ కాంపిటీషన్లో పాల్గొన్నానని చెప్పడం అందరినీ కలచివేసింది. ఏది ఏమైనా ఆ రెస్టారెంట్కు మాత్రం ఇప్పుడు కస్టమర్లు పోటెత్తుతున్నారు. వ్యాపారం చేయాలనే ఐడియా ఉండాలే కానీ ఇలాంటి ట్రిక్స్ను ఎన్నో పాటించి లాభాలను సంపాదించవచ్చు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…