Viral Video : పెళ్లిళ్లు జరిగినప్పుడు అతిథులకు విందు భోజనం వడ్డించడం మామూలే. ఎవరి స్థోమతకు తగినట్లుగా వారు వివాహ భోజనాలు పెడుతుంటారు. ఇక తెలంగాణలో అయితే చాలా వరకు వివాహాల్లో కచ్చితంగా నాన్ వెజ్ ఉండి తీరాల్సిందే. నాన్ వెజ్ లేనిదే తెలంగాణలో ఏ శుభ కార్యం పూర్తి కాదనే చెప్పాలి. అయితే నాన్ వెజ్ పెట్టి అందరికీ సరిపోయేలా వడ్డిస్తే ఓకే. లేదంటే గొడవలు అయిపోతాయి. అవును, సరిగ్గా ఇలాగే జరిగింది అక్కడ. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో ఉన్న నవీపేట అనే ప్రాంతంలో ఈమధ్యే ఒక పెళ్లి జరిగింది. వివాహ వేడుకలో భాగంగా మటన్ కూరను వడ్డించారు. అయితే తమకు మటన్ కూరను సరిగ్గా వేయడం లేదని, కొంచెమే వేస్తున్నారని వరుడు తరఫున వచ్చిన బంధువులు గొడవకు దిగారు. దీంతో చిలికి చిలికి గాలి వానగా మారినట్లు గొడవ కాస్తా పెద్దదైంది.
ఈ క్రమంలో వరుడు, వధువు.. ఇరు పక్షాలకు చెందిన వారు రక్తాలు వచ్చేలా తన్నుకున్నారు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని అక్కడ ప్రశాంతమైన వాతావరణం ఏర్పడేలా చూశారు. తరువాత ఘటనకు పాల్పడిన 11 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం అంతా బాగానే ఉందని తెలిపారు. అయితే ఈ ఘటన తాలూకు వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది వైరల్గా మారింది. దీంతో నెటిజన్లు ఈ వీడియోకు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…
భారత్, శ్రీలంకలో ఫిబ్రవరి 7వ తేదీ నుంచి జరగనున్న టీ20 వరల్డ్కప్ 2026 జట్టులో తనకు చోటు దక్కకపోవడంపై భారత…
ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం హైబీపీ అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. చాలా మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. కొందరికి…