Viral Video : పెళ్లిళ్లు జరిగినప్పుడు అతిథులకు విందు భోజనం వడ్డించడం మామూలే. ఎవరి స్థోమతకు తగినట్లుగా వారు వివాహ భోజనాలు పెడుతుంటారు. ఇక తెలంగాణలో అయితే చాలా వరకు వివాహాల్లో కచ్చితంగా నాన్ వెజ్ ఉండి తీరాల్సిందే. నాన్ వెజ్ లేనిదే తెలంగాణలో ఏ శుభ కార్యం పూర్తి కాదనే చెప్పాలి. అయితే నాన్ వెజ్ పెట్టి అందరికీ సరిపోయేలా వడ్డిస్తే ఓకే. లేదంటే గొడవలు అయిపోతాయి. అవును, సరిగ్గా ఇలాగే జరిగింది అక్కడ. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో ఉన్న నవీపేట అనే ప్రాంతంలో ఈమధ్యే ఒక పెళ్లి జరిగింది. వివాహ వేడుకలో భాగంగా మటన్ కూరను వడ్డించారు. అయితే తమకు మటన్ కూరను సరిగ్గా వేయడం లేదని, కొంచెమే వేస్తున్నారని వరుడు తరఫున వచ్చిన బంధువులు గొడవకు దిగారు. దీంతో చిలికి చిలికి గాలి వానగా మారినట్లు గొడవ కాస్తా పెద్దదైంది.
ఈ క్రమంలో వరుడు, వధువు.. ఇరు పక్షాలకు చెందిన వారు రక్తాలు వచ్చేలా తన్నుకున్నారు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని అక్కడ ప్రశాంతమైన వాతావరణం ఏర్పడేలా చూశారు. తరువాత ఘటనకు పాల్పడిన 11 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం అంతా బాగానే ఉందని తెలిపారు. అయితే ఈ ఘటన తాలూకు వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది వైరల్గా మారింది. దీంతో నెటిజన్లు ఈ వీడియోకు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…
తమిళ నటుడు ఆర్. పార్థిబన్ చేసిన వ్యాఖ్యలకు గాను నటి త్రిష ఘాటుగా స్పందించింది. ఈ మేరకు త్రిష తన…
నటుడు జూనియర్ ఎన్టీఆర్ మార్చి 8, 2026న బెంగళూరులో నిర్వహించిన కిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.…
టాలీవుడ్ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నారు. తన ప్రియురాలు కావ్యతో ఆయన నిశ్చితార్థం ఆదివారం (మార్చి…
ఒత్తిడిని తగ్గించుకునేందుకు తాను ఫోన్నే కాదు, సోషల్ మీడియాను కూడా దూరంగా పెట్టానని, ఇప్పటికీ సామాజిక మాధ్యమాలను చూడడం లేదని…
విశ్వక్ సేన్, కయాదు లోహర్ హీరో హీరోయిన్లుగా థియేటర్లలో రిలీజ్ అయిన ఫంకీ మూవీ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్కు రెడీ…