సాధారణంగా పాములు పగ పడతాయన్న విషయం మనం విన్నాం. కానీ కోతులు పగపట్టడం మీరు ఎప్పుడైనా విన్నారా.. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. కర్ణాటకకు చెందిన ఈ కోతి పగ గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిందే. ఈ కోతి పగ కారణంగా చిక్కమగళూరు జిల్లా కొట్టిగెహర గ్రామ ప్రజలు హడలిపోతున్నారు. ముఖ్యంగా జగదీష్ అనే వ్యక్తి కోతి పేరు ఎత్తితేనే భయంతో వణికిపోతున్న ఘటన చోటుచేసుకుంది. అసలు కోతి ఆ వ్యక్తిపై పగ పెంచుకోవడానికి కారణం ఏమిటి ? అనే విషయానికి వస్తే..
సాధారణంగా కోతులు మన చేతిలో ఏదైనా తినుబండారాలు ఉంటే లాక్కొని వెళ్తుంటాయి. ఈ క్రమంలోనే గ్రామంలో తిరిగి పాఠశాలలు ప్రారంభం కావడం చేత పాఠశాల పిల్లలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయనే ఉద్దేశంతో గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చి కోతులను పట్టుకోవాలని ప్రయత్నించారు. ఈ క్రమంలోనే
బోనెట్ మకాక్ జాతికి చెందిన ఒక మగ కోతి అటవీ అధికారులకు చుక్కలు చూపించింది. ఎంత ప్రయత్నించినా అధికారులకు దొరకకపోవడంతో అక్కడే ఉన్న ఆటోడ్రైవర్ల సహాయం తీసుకున్నారు.
ఈ క్రమంలోనే జగదీశ్ అనే వ్యక్తి కోతిని చాలా ఇబ్బంది పెడుతూ ఉండడంతో.. ఆగ్రహించిన ఆ కోతి అతనిపై దూకి విపరీతమైన గాయాలతో మొత్తం కొరికి ఎన్నో ఇబ్బందులకు గురి చేసింది. ఈ క్రమంలోనే ఆ కోతి బారి నుంచి తప్పించుకుని పారిపోయి ఒక ఆటోరిక్షాలో దాక్కోవలసి వచ్చింది. అధికారులు ఆ కోతిని పట్టుకొని 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న అడవి ప్రాంతంలో వదిలిపెట్టారు. ఆ కోతి బెడద తప్పిందని గ్రామస్తులు అందరూ సంతోషం వ్యక్తం చేసినప్పటికీ జగదీష్ మాత్రం ఇంటి నుంచి కాలు బయట పెట్టలేదు.
అయితే కోతి బెడద తప్పిందన్న సంతోషం కొన్ని రోజులు కూడా గడవకముందే ఆ కోతి తిరిగి గ్రామంలోకి రావడంతో గ్రామస్తులు మరోసారి భయంతో వణికి పోతున్నారు. ఇదే విషయాన్ని గ్రామస్తులు అటవీ అధికారులకు తెలియజేయగా అధికారులు మరోసారి ఆ కోతిని పట్టుకొని మరింత దూరంలో ఉన్న అటవీ ప్రాంతంలో వదిలి వెళ్లారు. ఏది ఏమైనప్పటికీ మనుషులపై పగ పెంచుకుని కోతి 22 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి రావడం గమనార్హం.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…