సాధారణంగా మనం ఐరన్ వస్తువులను ఎక్కువగా గాలి, వెలుతురు తాకే చోట పెడితే తొందరగా అవి తుప్పుపట్టి నాశనమవుతాయి. ఇవి గాలిలో ఉన్న ఆక్సిజన్ తో చర్యలు జరిపి తుప్పు పట్టడానికి కారణమవుతాయి. ఈ క్రమంలోనే రైలు పట్టాలను కూడా ఇనుముతోనే తయారు చేస్తారు కదా. మరలాంటప్పుడు అవి నిత్యం వెలుతురు, గాలి తాకే ప్రదేశాలలో ఉన్నప్పటికీ ఎందుకు తుప్పు పట్టవు ? అనే సందేహం ప్రతి ఒక్కరికి కలుగుతుంది. మరి రైలు పట్టాలు తుప్పు పట్టకపోవడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే..
సాధారణంగా మనం సుదూర ప్రాంతాలకు వెళ్లాలంటే రైలు ప్రయాణం ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. కనుక రైలు పట్టాలను నిర్మించేటప్పుడు ఎంతో నాణ్యమైన ఉక్కును ఉపయోగిస్తారు. ఈ ఉక్కులో 1% కార్బన్, 12% మాంగనీస్ కలిపి తయారు చేస్తారు. అందుకే వీటిని ‘సీ-ఎంఎన్’ రైల్ స్టీల్ అని కూడా అంటారు. ఎంతో
నాణ్యమైన ఉక్కుతో తయారు చేస్తారు కనుక సంవత్సరానికి 0.05 మి.మీ మాత్రమే తుప్పు పడుతుంది కాబట్టి 1 మి.మీ. రైల్ ట్రాక్ తుప్పు పట్టడానికి సుమారుగా 20 సంవత్సరాల కాలం పడుతుంది. అందుకనే ఎక్కువ ఏళ్ల పాటు పట్టాలు గాలి, వెలుతురులో ఉన్నా.. అవి తుప్పు పట్టవు. అవి తుప్పు పట్టకపోవడానికి గల కారణం ఇదే.
ఇక రైలు కింద అధిక ఒత్తిడికి రైలు పట్టాలు గురవుతాయి కనుక ఎప్పుడైనా, ఎక్కడైనా రైలు పట్టాలు పాడైనట్టు అనిపించినా వెంటనే రైల్వే అధికారులు అప్రమత్తం అయ్యి వెంటనే వాటిని తొలగించి కొత్తవి వేస్తారు. అదే విధంగా రైల్వే ట్రాక్ తుప్పు పట్టకుండా కోటింగ్ వేస్తారు కనుక రైలు పట్టాలు త్వరగా తుప్పు పట్టవు.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఉగాది…