సైకిల్ తయారు చేయాలంటే ఎన్నో వస్తువులు కావాలి. కానీ ఆర్టిస్టులకు మాత్రం అలాంటి వస్తువులతో పనిలేదు. తమ మనసులో ఏదైనా ఆలోచన మెదిలితే చాలు వెంటనే దాన్ని ఆచరణలో పెట్టి చూపిస్తారు. ఈ విధమైన ఆలోచన చేసిన వారిలో ఒడిశాకు చెందిన ఈ కళాకారుడే నిదర్శనం అని చెప్పవచ్చు.తనకు వచ్చిన విభిన్నమైన ఆలోచనను ఉపయోగించి ఏకంగా అగ్గిపుల్లలతో సైకిల్ నమూనాలు తయారు చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు.
ఏకంగా 3653 అగ్గిపుల్లలను ఉపయోగించి ఈ కళాకారుడు పెన్నీ ఫార్తింగ్ సైకిల్’ నమూనా తయారు చేశాడు.1870లో ఉండే ఈ సైకిల్ కు రెండు చక్రాలు సమానంగా ఉండవు. ఒకటి పెద్దగా ఉంటే మరొకటి చిన్నదిగా ఉంటుంది. 50 ఇంచుల పొడవు, 25 ఇంచుల వెడల్పు గల ఈ సైకిల్ ను పూరీకి చెందిన శాశ్వత్ రంజన్ సాహూ కేవలం 7 రోజులలోనే పూర్తి చేశాడు.
ప్రస్తుతం ఈ సైకిల్ నమూనా కి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సందర్భంగా సాహూ మాట్లాడుతూ… స్కూలు చదువుకునే రోజుల్లోనే ఈ సైకిల్ గురించి విన్నాను, ఎలాగైనా ఈ సైకిల్ తొక్కాలంటే ఆశ తనకు ఉండేదని అయితే ప్రస్తుతం అందుబాటులో లేకపోవటం వల్లే ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా ఈ సైకిల్ నమూనాను తయారు చేసినట్లు తెలిపారు. మరింకెందుకాలస్యం ఇంత అద్భుతమైన ఈ ఫోటో పై మీరూ ఓ లుక్కేయండి.
జాతీయ అవార్డు విజేత, నటి ప్రియమణి కెరీర్ మరింత ఆసక్తికరంగా కొనసాగుతోంది. రెండు దశాబ్దాలకు పైగా సినీ పరిశ్రమలో కొనసాగుతున్న…
థియేటర్ రద్దీ లేదు.. ట్రాఫిక్ టెన్షన్ లేదు.. లైన్లో నిలబడే అవసరం లేదు. రిమోట్లో ఒక్క క్లిక్ చేస్తే చాలు..…
అధునాతన కంప్యూటింగ్ అభివృద్ధి కేంద్రం (Centre for Development of Advanced Computing) సీ-డాక్ 2026 సంవత్సరానికి గాను భారీ…
టాలీవుడ్లో చాలాకాలంగా హాట్టాపిక్గా మారిన ప్రేమకథకు త్వరలోనే అధికారిక ముగింపు పడనుందన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. నటులు విజయ్ దేవరకొండ, రష్మిక…
రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. Railway Recruitment Boards (RRBs) 2026 గ్రూప్ D నియామకాలకు సంబంధించి…
భారత్లో అత్యధిక బ్యాటరీ సామర్థ్యంతో కూడిన స్మార్ట్ఫోన్ను విడుదల చేస్తామని హామీ ఇచ్చినట్లే realme తన పి సిరీస్లో తాజా…
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…