మన సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం కొన్ని వస్తువులను ఎంతో పవిత్రంగా భావిస్తున్నాము. అలాంటి వస్తువులను ఎక్కడపడితే అక్కడ పెట్టకూడదు అనే నియమాలను కూడా పాటిస్తుంటారు. ఈ క్రమంలోనే పూజకు సంబంధించిన వస్తువులను పూజా సామాగ్రిని నేలపై పెట్టకూడదని చెబుతుంటారు. ఇవే కాకుండా మరికొన్ని వస్తువులను కూడా ఎలాంటి పరిస్థితులలో కూడా నేలపై పెట్టకూడదు. మరి అలాంటి వస్తువులు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.
హిందువులలో చాలామంది జంధ్యం ధరించి ఉంటారు. ఈ జంధ్యాన్ని తల్లిదండ్రులకు గురువుకు ప్రతీకగా భావిస్తారు. ఎంతో పవిత్రమైన ఈ జంధ్యాన్ని ఎలాంటి పరిస్థితులలో కూడా కింద పెట్టకూడదు. ఒకవేళ అలా జంధ్యాన్ని నేలపై పెట్టడం వల్ల గురువును తల్లిదండ్రులను అవమానించినట్లని భావిస్తారు. మహావిష్ణువుకు ఎంతో ప్రత్యేకమైన సాలి గ్రామాలను కూడా కింద పెట్టకూడదు.
ప్రతిరోజు ఉదయం సాయంత్రం మనం దేవుడు ముందు దీపాలను వెలిగిస్తారు. ఈ దీపాలను నేలపై పెట్టకూడదు. ఎటువంటి ఆధారం లేకుండా దేవుడికి దీపం వెలిగిస్తే మన జీవితానికి కూడా ఎటువంటి ఆధారం ఉండదని చెబుతారు. అందుకోసమే ఏదైనా ధాన్యం లేదా ఆకుపై దీపాన్ని వెలిగించాలి. శంకువును సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. కనుక శంకువుని ఎలాంటి పరిస్థితులలో కూడా కింద పెట్టకూడదు. శంఖాన్ని ఏదైనా పసుపుపచ్చని లేదా ఎరుపు రంగు వస్త్రంలో కానీ, ధాన్యం పై గాని పెట్టి పూజించాలి.ఈ విధంగా హిందువులు ఎంతో పవిత్రంగా భావించే వస్తువులను ఎలాంటి పరిస్థితులలో కూడా నేలపై పెట్టకూడదని పండితులు చెబుతున్నారు.
హెయిర్ వీవింగ్ కంపెనీలు, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ డాక్టర్లు తనకు డబ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాలని తరచూ…
స్కూల్, కాలేజీల్లో చదివినప్పుడు ఎన్నడూ 80 శాతం మార్కులను దాటలేకపోయానని, కానీ భారత టీ20 జట్టు కెప్టెన్గా 80 శాతానికి…
తాను పెళ్లి చేసుకోబోతున్నానని మీడియాతోపాటు సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చెందుతున్న వార్తలను నటి అనుష్క శెట్టి ఖండించింది. ఈ మేరకు…
భారతీయ చిత్ర పరిశ్రమకు చెందిన సినిమాల్లో పరిమితులు ఉంటాయని, హాలీవుడ్లో సినిమాల విషయంలో ఎలాంటి పరిమితులు ఉండవని, అందుకనే అక్కడ…
భారత క్రికెట్ జట్టు రిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన బాల్య స్నేహితురాలు వంశికా చద్దాను వివాహం చేసుకున్న నేపథ్యంలో…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ 2 చిత్రం విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. ఈ…
వ్యాపార వేత్త సోహైల్ ఖతురియాతో విడాకులు తీసుకున్న అనంతరం హన్సిక మోత్వాని గోల్డెన్ టెంపుల్ను సందర్శించి ఇన్స్టాగ్రామ్లో కీలక పోస్టు…
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…