తెలంగాణ సీఎం కేసీఆర్ గురించి ప్రత్యేకంగా ఎవరికీ చెప్పాల్సిన పనిలేదు. ఆయన స్టైలే వేరు. ప్రజలకు వరాలను ఇవ్వాలన్నా.. వారిని చలోక్తులు, జోకులతో నవ్వించాలన్నా.. ఆయనను మించిన రాజకీయ నాయకుడు లేరు. అందుకనే రెండోసారి ఆయనను సీఎంను చేశారు. అయితే ఆయనకు కోపం వస్తే మామూలుగా ఉండదు. తాజాగా ఓ చోట జరిగిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్కు కోపం వచ్చింది. దీంతో ఆయన ఏం చేశారో చూడండి.
తన తనయుడు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నియోజకవర్గం సిరిసిల్లలో సీఎం కేసీఆర్ తాజాగా పర్యటించారు. ఇందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా మండెపల్లిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేసీఆర్ ప్రారంభించారు. అయితే అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు, నిర్వాహకులు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభించానికి కత్తెరను ఏర్పాటు చేయడం మరిచిపోయారు.
ఈ క్రమంలో రిబ్బన్ను కట్ చేసి ఇంట్లోకి వెళ్లేందుకు సీఎం కేసీఆర్ కొద్ది సేపు గుమ్మం వద్ద ఆగారు. అయినప్పటికీ కత్తెరను అందించలేకపోయారు. దీంతో కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే రిబ్బన్ను చేత్తో తొలగించి విసిరేసినట్లు పక్కకు వేశారు. కాగా ఆ సమయంలో తీసిన వీడియో వైరల్ గా మారింది.
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…
భారత్, శ్రీలంకలో ఫిబ్రవరి 7వ తేదీ నుంచి జరగనున్న టీ20 వరల్డ్కప్ 2026 జట్టులో తనకు చోటు దక్కకపోవడంపై భారత…