తెలంగాణ సీఎం కేసీఆర్ గురించి ప్రత్యేకంగా ఎవరికీ చెప్పాల్సిన పనిలేదు. ఆయన స్టైలే వేరు. ప్రజలకు వరాలను ఇవ్వాలన్నా.. వారిని చలోక్తులు, జోకులతో నవ్వించాలన్నా.. ఆయనను మించిన రాజకీయ నాయకుడు లేరు. అందుకనే రెండోసారి ఆయనను సీఎంను చేశారు. అయితే ఆయనకు కోపం వస్తే మామూలుగా ఉండదు. తాజాగా ఓ చోట జరిగిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్కు కోపం వచ్చింది. దీంతో ఆయన ఏం చేశారో చూడండి.
తన తనయుడు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నియోజకవర్గం సిరిసిల్లలో సీఎం కేసీఆర్ తాజాగా పర్యటించారు. ఇందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా మండెపల్లిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేసీఆర్ ప్రారంభించారు. అయితే అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు, నిర్వాహకులు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభించానికి కత్తెరను ఏర్పాటు చేయడం మరిచిపోయారు.
ఈ క్రమంలో రిబ్బన్ను కట్ చేసి ఇంట్లోకి వెళ్లేందుకు సీఎం కేసీఆర్ కొద్ది సేపు గుమ్మం వద్ద ఆగారు. అయినప్పటికీ కత్తెరను అందించలేకపోయారు. దీంతో కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే రిబ్బన్ను చేత్తో తొలగించి విసిరేసినట్లు పక్కకు వేశారు. కాగా ఆ సమయంలో తీసిన వీడియో వైరల్ గా మారింది.
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…
తమిళ నటుడు ఆర్. పార్థిబన్ చేసిన వ్యాఖ్యలకు గాను నటి త్రిష ఘాటుగా స్పందించింది. ఈ మేరకు త్రిష తన…
నటుడు జూనియర్ ఎన్టీఆర్ మార్చి 8, 2026న బెంగళూరులో నిర్వహించిన కిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.…