ప్రతి వ్యక్తి తన ఇంట్లో శాంతియుత వాతావరణం ఉండాలని కోరుకుంటాడు. సంపద రావాలని ఆశిస్తుంటాడు. ఇందుకోసం అనేక చర్యలు తీసుకుంటుంటారు. అయితే ఈ విషయాలను వాస్తు శాస్త్రంలో వివరంగా ప్రస్తావించారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ఆనందానికి, శాంతికి ఆటంకం కలిగించే కొన్ని వస్తువులు ఉన్నాయి. అలాగే ఇంట్లో ఉంచుకోవాల్సిన వస్తువులు కొన్ని ఉన్నాయి. వాటిని ఇంట్లో పెట్టుకుంటే సంపద పెరుగుతుంది.
1. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి పైకప్పుపై పడమటి దిశలో వాటర్ ట్యాంక్ ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో సమస్యలు రావు. ఇంట్లో ఆర్థిక పరిస్థితి సరిగ్గా ఉంటుంది. ఇంట్లో ఉన్న వారి మధ్య ప్రేమ, ఆప్యాయత, అనురాగం కలుగుతాయి.
2. లోహంతో తయారు చేసిన చేపలు, తాబేలు బొమ్మలను ఇంట్లో ఉంచడం శుభప్రదం. ఇవి ఇంట్లోని ఇబ్బందులను తొలగిస్తాయి. డబ్బు వచ్చేలా చేస్తాయి. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి.
3. లక్ష్మీ దేవిని సంపదను అందించే దేవతగా భావిస్తారు. కనుక ఇంట్లో ఉత్తరం వైపున తామరపువ్వుపై కూర్చుని బంగారు నాణేలు కిందకు వదులుతున్న లక్ష్మీ దేవి విగ్రహాన్ని ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో అందరికీ కలసి వస్తుంది. ఆర్థిక సమస్యలు తగ్గుతాయి.
4. ఇంట్లో ఉత్తరం వైపున నీటితో నిండిన ఒక మట్టి కుండను లేదా కూజాను ఉంచాలి. దీంతో ఆర్థిక సంక్షోభం ఏర్పడదు. మట్టి కుండలో ఎప్పుడూ నీరు ఉండాలి. ఖాళీగా ఉండకూడదు.
5. చిలుక చిత్రాన్ని ఇంట్లో ఉత్తర దిశలో ఉంచాలి. దీంతో ఇంట్లో చదువుతున్న పిల్లలపై మంచి ప్రభావాన్ని చూపిస్తుంది.
6. ఇంట్లో వెండి, ఇత్తడి లేదా రాగితో చేసిన పిరమిడ్ను ఉంచడం మంచి ఫలితాలను ఇస్తుంది. కుటుంబ సభ్యులు కలిసి ఎక్కువ సమయం గడిపే ప్రదేశంలో పిరమిడ్ ను ఉంచాలి. దీని వల్ల ఇంట్లోని అందరికీ సమస్యలు రాకుండా ఉంటాయి.
ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్వేర్ అప్డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్కు అనుసంధానమైన మొబైల్ నంబర్ను అప్డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…