ప్రతి వ్యక్తి తన ఇంట్లో శాంతియుత వాతావరణం ఉండాలని కోరుకుంటాడు. సంపద రావాలని ఆశిస్తుంటాడు. ఇందుకోసం అనేక చర్యలు తీసుకుంటుంటారు. అయితే ఈ విషయాలను వాస్తు శాస్త్రంలో వివరంగా ప్రస్తావించారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ఆనందానికి, శాంతికి ఆటంకం కలిగించే కొన్ని వస్తువులు ఉన్నాయి. అలాగే ఇంట్లో ఉంచుకోవాల్సిన వస్తువులు కొన్ని ఉన్నాయి. వాటిని ఇంట్లో పెట్టుకుంటే సంపద పెరుగుతుంది.
1. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి పైకప్పుపై పడమటి దిశలో వాటర్ ట్యాంక్ ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో సమస్యలు రావు. ఇంట్లో ఆర్థిక పరిస్థితి సరిగ్గా ఉంటుంది. ఇంట్లో ఉన్న వారి మధ్య ప్రేమ, ఆప్యాయత, అనురాగం కలుగుతాయి.
2. లోహంతో తయారు చేసిన చేపలు, తాబేలు బొమ్మలను ఇంట్లో ఉంచడం శుభప్రదం. ఇవి ఇంట్లోని ఇబ్బందులను తొలగిస్తాయి. డబ్బు వచ్చేలా చేస్తాయి. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి.
3. లక్ష్మీ దేవిని సంపదను అందించే దేవతగా భావిస్తారు. కనుక ఇంట్లో ఉత్తరం వైపున తామరపువ్వుపై కూర్చుని బంగారు నాణేలు కిందకు వదులుతున్న లక్ష్మీ దేవి విగ్రహాన్ని ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో అందరికీ కలసి వస్తుంది. ఆర్థిక సమస్యలు తగ్గుతాయి.
4. ఇంట్లో ఉత్తరం వైపున నీటితో నిండిన ఒక మట్టి కుండను లేదా కూజాను ఉంచాలి. దీంతో ఆర్థిక సంక్షోభం ఏర్పడదు. మట్టి కుండలో ఎప్పుడూ నీరు ఉండాలి. ఖాళీగా ఉండకూడదు.
5. చిలుక చిత్రాన్ని ఇంట్లో ఉత్తర దిశలో ఉంచాలి. దీంతో ఇంట్లో చదువుతున్న పిల్లలపై మంచి ప్రభావాన్ని చూపిస్తుంది.
6. ఇంట్లో వెండి, ఇత్తడి లేదా రాగితో చేసిన పిరమిడ్ను ఉంచడం మంచి ఫలితాలను ఇస్తుంది. కుటుంబ సభ్యులు కలిసి ఎక్కువ సమయం గడిపే ప్రదేశంలో పిరమిడ్ ను ఉంచాలి. దీని వల్ల ఇంట్లోని అందరికీ సమస్యలు రాకుండా ఉంటాయి.
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…