చాలామంది ఏవేవో కారణాల వలన ఇల్లు మారుతూ ఉంటారు. ఇల్లు మారేటప్పుడు కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. వాస్తు ప్రకారం ఇల్లు బాగుండేటట్టు కూడా చూసుకుంటూ ఉండాలి. ఇల్లు మారేటప్పుడు పొరపాట్లు చేస్తే, అనవసరంగా లేనిపోని ఇబ్బందుల్లో పడాల్సి ఉంటుంది. ఈరోజు ఇల్లు మారేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాన్ని చూసేద్దాం. ఎప్పుడైనా వేరే అద్దె ఇంటికి వెళ్ళినప్పుడు, ఇంటి యజమాని పేరుకి ఏ దిక్కు సరిపోతుంది అనేది చూసుకుని, దానికి తగ్గట్టుగా ఇల్లును చూసుకొని మారాలి.
అదే మీరు సొంత ఇంటిని కట్టుకుంటున్నట్లయితే, ఇంటి యజమానితో పాటగా భార్యాబిడ్డల పేరు కూడా చూసుకుని, ఏ దిక్కులో ఇల్లు ఉంటే మంచిది అని చూసుకుని ఆ తర్వాత ఇంటిని నిర్మించుకోవాలి. ఇల్లును ఎప్పుడైనా మారేటప్పుడు కచ్చితంగా వాస్తు పరంగా ఆ ఇల్లు బాగుందా లేదా అనేది తప్పక చూసుకోవాలి. అలానే ముఖ్యంగా ఇంటి ముఖద్వారం గురించి చూసుకోవాలి. ఏదైనా ఇంటికి వెళ్ళేటప్పుడు శకునాన్ని బట్టి కూడా ఆ ఇంటికి వెళ్ళొచ్చా లేదా అనేది తెలుసుకోవచ్చు.
కొన్ని కొన్ని సార్లు ఇల్లంతా బాగుంటుంది. కానీ రెండు మూడు ఇళ్ల నుండి కూడా ఎవరు ఆ ఇంట్లో ఉండరు. అలాంటి ఇంటికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అటువంటి ఇళ్లల్లో ప్రేతాత్మలు ఉండే అవకాశం ఉంది. గరుడ పురాణం ప్రకారం చూసినట్లయితే ఒక మనిషి చనిపోయినప్పుడు బొటనవేలంత అయిపోతాడు. అయితే మనిషి చనిపోయిన తర్వాత పది రోజులు కూడా కర్మలు చేస్తూ ఉంటారు. అప్పుడు ఆ మనిషికి శరీరం వస్తుంది. ఒకవేళ కనుక ఇది జరగకపోతే శరీరం రాదు. ప్రేతాత్మ అయ్యి తిరుగుతాడు.
ఆ వ్యక్తి ఈ భూమి అంతరించిపోయే వరకు కూడా ప్రేతాత్మ అయ్యి తిరుగుతూ ఉంటాడు. ఈ ప్రేతాత్మలు ఖాళీగా ఉండే ఇళ్లల్లో ఉంటాయి. ఇలాంటి బాధలు ఏమీ లేకుండా ఉండాలంటే, మీరు ఇంట్లో దిగడానికి ముందు, ఆ ఇంట్లో గోమూత్రాన్ని చల్లాలి. అదే విధంగా 11 రోజులు పాటు ఉప్పుని నీళ్లలో వేసి, ఆ నీటిని ఇల్లు శుభ్రం చేయడానికి ఉపయోగిస్తే ప్రేతాత్మలు పోతాయి. పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. లలితా సహస్రం చదవడం ఆడియో ని ప్లే చేయడం వంటివి చేస్తే కూడా ఆ తరంగాలు ఇంట్లో వచ్చి మంచి వైబ్రేషన్స్ తీసుకువస్తాయి. ఇలా చిక్కులు లేకుండా ఆ తర్వాత ఇంట్లో సుఖంగా ఉండొచ్చు. సమస్యలేమి లేకుండా హాయిగా జీవించొచ్చు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…