చాలామంది ఏవేవో కారణాల వలన ఇల్లు మారుతూ ఉంటారు. ఇల్లు మారేటప్పుడు కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. వాస్తు ప్రకారం ఇల్లు బాగుండేటట్టు కూడా చూసుకుంటూ ఉండాలి. ఇల్లు మారేటప్పుడు పొరపాట్లు చేస్తే, అనవసరంగా లేనిపోని ఇబ్బందుల్లో పడాల్సి ఉంటుంది. ఈరోజు ఇల్లు మారేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాన్ని చూసేద్దాం. ఎప్పుడైనా వేరే అద్దె ఇంటికి వెళ్ళినప్పుడు, ఇంటి యజమాని పేరుకి ఏ దిక్కు సరిపోతుంది అనేది చూసుకుని, దానికి తగ్గట్టుగా ఇల్లును చూసుకొని మారాలి.
అదే మీరు సొంత ఇంటిని కట్టుకుంటున్నట్లయితే, ఇంటి యజమానితో పాటగా భార్యాబిడ్డల పేరు కూడా చూసుకుని, ఏ దిక్కులో ఇల్లు ఉంటే మంచిది అని చూసుకుని ఆ తర్వాత ఇంటిని నిర్మించుకోవాలి. ఇల్లును ఎప్పుడైనా మారేటప్పుడు కచ్చితంగా వాస్తు పరంగా ఆ ఇల్లు బాగుందా లేదా అనేది తప్పక చూసుకోవాలి. అలానే ముఖ్యంగా ఇంటి ముఖద్వారం గురించి చూసుకోవాలి. ఏదైనా ఇంటికి వెళ్ళేటప్పుడు శకునాన్ని బట్టి కూడా ఆ ఇంటికి వెళ్ళొచ్చా లేదా అనేది తెలుసుకోవచ్చు.
కొన్ని కొన్ని సార్లు ఇల్లంతా బాగుంటుంది. కానీ రెండు మూడు ఇళ్ల నుండి కూడా ఎవరు ఆ ఇంట్లో ఉండరు. అలాంటి ఇంటికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అటువంటి ఇళ్లల్లో ప్రేతాత్మలు ఉండే అవకాశం ఉంది. గరుడ పురాణం ప్రకారం చూసినట్లయితే ఒక మనిషి చనిపోయినప్పుడు బొటనవేలంత అయిపోతాడు. అయితే మనిషి చనిపోయిన తర్వాత పది రోజులు కూడా కర్మలు చేస్తూ ఉంటారు. అప్పుడు ఆ మనిషికి శరీరం వస్తుంది. ఒకవేళ కనుక ఇది జరగకపోతే శరీరం రాదు. ప్రేతాత్మ అయ్యి తిరుగుతాడు.
ఆ వ్యక్తి ఈ భూమి అంతరించిపోయే వరకు కూడా ప్రేతాత్మ అయ్యి తిరుగుతూ ఉంటాడు. ఈ ప్రేతాత్మలు ఖాళీగా ఉండే ఇళ్లల్లో ఉంటాయి. ఇలాంటి బాధలు ఏమీ లేకుండా ఉండాలంటే, మీరు ఇంట్లో దిగడానికి ముందు, ఆ ఇంట్లో గోమూత్రాన్ని చల్లాలి. అదే విధంగా 11 రోజులు పాటు ఉప్పుని నీళ్లలో వేసి, ఆ నీటిని ఇల్లు శుభ్రం చేయడానికి ఉపయోగిస్తే ప్రేతాత్మలు పోతాయి. పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. లలితా సహస్రం చదవడం ఆడియో ని ప్లే చేయడం వంటివి చేస్తే కూడా ఆ తరంగాలు ఇంట్లో వచ్చి మంచి వైబ్రేషన్స్ తీసుకువస్తాయి. ఇలా చిక్కులు లేకుండా ఆ తర్వాత ఇంట్లో సుఖంగా ఉండొచ్చు. సమస్యలేమి లేకుండా హాయిగా జీవించొచ్చు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…