Bamboo Plant : చాలా మంది తమ తమ ఇండ్లలో తులసి, బాంబూ, మనీ ప్లాంట్, అపరాజిత వంటి మొక్కలను పెంచుకుంటారు. వీటి వల్ల ఇంట్లోని వారికి ఆరోగ్యం కలుగుతుందని, ధనం నిలుస్తుందని వారి నమ్మకం. అయితే అంత వరకు ఓకే. కానీ బాంబూ మొక్క విషయానికి వస్తే మాత్రం దాన్ని ఒక నిర్దిష్టమైన పద్ధతిలో పెట్టుకుంటేనే తద్వారా ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రసరిస్తుందట. దీంతో అంతా శుభమే కలుగుతుందట. మరి బాంబూ మొక్కను ఇంట్లో ఎలా పెట్టుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామా.
ఫెంగ్ షుయ్ వాస్తు ప్రకారమైతే బాంబూ మొక్కలను భూమి, నీరు, అగ్ని, లోహం అనే అంశాలు ప్రతిబింబించే విధంగా పెట్టుకోవాలట. దాంతో ఆ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రసారమై వారందరికీ మంచే జరుగుతుందట. అనుకున్నవి నెరవేరుతాయట. అయితే అలా ఆయా అంశాలను ప్రతిబింబించేలా మొక్కను పెట్టాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.
బాంబూ మొక్కను ఓ చిన్న కంటెయినర్లో ఉంచి అందులో 2-3 ఇంచుల లోతులోనే నీటిని పోయాలి. దీంతో నీరు అనే అంశం ప్రతిబింబిస్తుంది. ఆ నీటిలో ఏదైనా ఓ నాణేన్ని వేయాలి. దీంతో లోహం అంశం పూర్తవుతుంది.
అదే నీటిలో రాళ్లను వేస్తే అది భూమిని ప్రతిబింబిస్తుంది. ఇక ఆ మొక్క అగ్నిని ప్రతిబింబించాలంటే దాని చుట్టూ ఎరుపు రంగు దారం కట్టాలి. దీంతో ముందు చెప్పిన నాలుగు అంశాలు ప్రతిబింబిస్తాయి.
అనంతరం మొక్కలో బేసి సంఖ్యలో కాండాలు ఉండేలా చూసుకోవాలి. అలా సరి చేశాక ఆ మొక్కను సూర్య రశ్మి తగలని ప్రదేశంలో ఉంచాలి. నీటిని ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలి. దీంతో మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అందరికీ లక్ కలసి వస్తుంది. ఏం చేసినా సరే తప్పక విజయం సాధిస్తారు.
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…