Akshaya Tritiya 2024 : అక్షయ తృతీయ.. దీనిని అఖా తీజ్ అని కూడా పిలుస్తారు. హిందువులు, జైనులు ఈ పండుగను ఎక్కువగా జరుపుకుంటారు. ఈ పండుగ వైశాఖ మాసంలోని శుక్లపక్షంలోని తృతీయ తిథి నాడు జరుపుకుంటారు. ఈ సంవత్సరం మే 10 న శుక్రుడు అస్తమించడంతో అక్షయ తృతీయ జరుగుతుంది. జోతిష్య శాస్త్రంలో శుక్ర గ్రహాన్ని ప్రేమ, అందం, శ్రేయస్సుకు కారకంగా పరిగణిస్తారు. వివాహం వంటి శుభ కార్యాలకు దీని అమరిక అశుభకరమైనదిగా పరిగణించబడుతుంది. శుక్రుడు అస్తమించడం వల్ల ఈ సంవత్సరం అక్షయ తృతీయ నాడు వివాహానికి సరైన ముహుర్తం లేదు. అలాగే ఈ రోజున అనేక శుభ యోగాలు కూడా ఏర్పడతాయి. గజకేసరి యోగం, ధన యోగం, శుక్రాధిత్య యోగం, షష్ యోగం, మాళవ్య రాజ యోగం వంటి యోగాలు కూడా ఈ అక్షయతృతీయ నాడు ఏర్పడనున్నాయి.
ఈ యోగాల వల్ల అన్ని రాశుల వారికి మేలు కలిగినప్పటికి కొన్ని రాశుల వారికి మరింత మేలు కలుగనుంది. అక్షయ తృతీయ నాడు ఏర్పడే ఈ యోగాల వల్ల మేలు కలగనున్న రాశుల గురించి … ఇప్పుడు తెలుసకుందాం. గజకేసరి యోగం వల్ల వృషభ, సింహ, కన్యా రాశుల వారికి ధనవృద్ది, శ్రేయస్సు, విజయం కలగనుంది. సూర్యుడు, బృహస్పతి కలయికతో ఏర్పడిన ఈ గజకేసరి యోగం సంపద, శ్రేయస్సును, కొత్త అవకాశాలన పొందడాన్ని సూచిస్తుంది. ఈ రాశి చక్రం ఉన్న వారు వ్యాపారం, వృత్తి, పెట్టుబడిలో అపూర్వమైన విజయాన్ని పొందుతారు. ధన యోగం వల్ల మీనరాశి వారికి ఆర్థిక లాభాలు, వ్యాపారంలో వృద్ది కలగనుండి. బుధుడు, కుజుడు కలయికతో ఏర్పడిన ఈ యోగం ఆకస్మిక ధన లాభానికి , కొత్త ఆస్తులకు, ఆర్థిక ప్రగతికి ప్రతీక.
మీన రాశి వారు వారసత్వం భూమి లేదా ఆస్థికి సంబంధించిన ప్రయోజనాలను పొందవచ్చు. ఇక శుక్రాధిత్య యోగం వల్ల అన్ని రాశుల వారికి మేలు కలిగినప్పటికి ముఖ్యంగా వృషభ, తుల, మకర రాశి వారికి మరింత మేలు కలుగనుంది. శుక్రుడు, సూర్యుని కలయికతో ఏర్పడిన ఈ యోగం ప్రేమ, అందం, విజయానికి చిహ్నం. ఈ రాశి వారు జీవితంలో ప్రేమను పొందుతారు. సమాజంలో గౌరవాన్ని పెంచుకుంటారు. అలాగే షష్ యోగం వల్ల కర్కాటకం, వృశ్యికం, మీనరాశుల వారికి గౌరవ, ప్రతిష్టలు పెరుగుతాయి. అలాగే మాళవ్య రాజయోగం వల్ల మీన రాశి వారికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. నూతన ఆస్తులు సంపాదిస్తారు. బృహస్పతి, చంద్రుని కలయికతో ఏర్పడిన ఈ యోగం కీర్తి, గౌరవం పెరగడాన్ని సూచిస్తుంది. ఈ విధంగా ఈ అక్షయ తృతీయ ఈ రాశుల వారికి మరింత మేలు చేయనన్నదని పండితులు చెబుతున్నారు.
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…
అనిల్ రావిపూడి తనకు అలవాటైన ఫార్ములాను విడిచిపెట్టకుండా, చిరంజీవి బలాలను చక్కగా వినియోగించుకుంటూ మరోసారి సంపూర్ణ వినోదాత్మక చిత్రాన్ని అందించారు.…
ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం గూగుల్ 2026 సంవత్సరానికి సంబంధించిన తన ప్రతిష్ఠాత్మక ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్కు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బ్యాచిలర్,…
ఇస్రోలో ఉద్యోగం సాధించాలనుకునే యువ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలకు ఇది ఒక అరుదైన అవకాశంగా భావిస్తున్నారు. అంతరిక్ష సాంకేతిక రంగంలో దేశ…
ఆ వ్యాఖ్యతో ముగిసేలా ఎడిట్ చేసిన వీడియో క్లిప్పులు విస్తృతంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫ్యాక్ట్ చెకర్, ఆల్ట్…