అప్పట్లో ఫ్రీడమ్ 251 పేరిట కేవలం రూ.251 చెల్లిస్తే చాలు ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ను అందిస్తామంటూ రింగింగ్ బెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది గుర్తుంది కదా. దీంతో ఆ ఫోన్ కోసం చాలా మంది ఎగబడ్డారు. అసలు రూ.251కే స్మార్ట్ ఫోన్ వస్తుందా ? అనే కనీస విషయం కూడా ఆలోచించకుండా పెద్ద ఎత్తున జనాలు ఆ ఫోన్ను రూ.251 చెల్లించి బుక్ చేశారు. కానీ ఫోన్ బుకింగ్స్ ప్రారంభమైన తొలి రోజే అది స్కాం అని తేలింది.
2016 ఫిబ్రవరి 18వ తేదీన మోహిత్ గోయెల్ అనే వ్యక్తి రింగింగ్ బెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ పేరిట కేవలం రూ.251కే ఆండ్రాయిడ్ ఫోన్ ను అందిస్తామంటూ పెద్ద ఎత్తున ప్రకటనలు చేశాడు. దీంతో తొలి రోజు చాలా మంది రూ.251 చెల్లించి ఫోన్లను ముందస్తుగా బుక్ చేశారు. మొదటి రోజు 30వేల మందికి పైగానే ఆ ఫోన్ బుక్ చేసుకున్నారు. అయితే తరువాత ఆ ఫోన్ ను ఎందరు బుక్ చేశారో తెలియదు కానీ మొత్తం రూ.60 కోట్ల మేర డబ్బులు వచ్చినట్లు తెలిసింది. కానీ ఆ వివరాలను మోహిత్ గోయెల్ వెల్లడించలేదు.
అయితే ఆ తరువాత ఇదొక స్కామ్ అని కొందరు కేసు వేశారు. కానీ మోహిత్ మాత్రం తాము ఫోన్లను డెలివరీ చేసేందుకు ఆలస్యం అవుతుందని, జూ 9, 2016 వరకు 5000 ఫోన్లను డెలివరీ చేశామని, మిగిలిన వారికి కూడా ఫోన్లను డెలివరీ చేస్తామని, అందుకు ప్రభుత్వాలు సహాయం చేయాలని కోరాడు. కానీ ఆ తరువాత ఆ ఫోన్లు ఎవరికీ డెలివరీ అయిన దాఖలాలు లేవు. తరువాత ఆ విషయాన్ని మరిచిపోయారు. ఇలా మోహిత్ గోయెల్ అనే వ్యక్తి భారీ ఎత్తున స్కామ్ చేశాడు. కానీ మీడియాకు మాత్రం ఫోన్లను డెలివరీ చేశాననే చెప్పుకొచ్చాడు. అయితే ఈ విషయంలో నిజం ఏమిటో తెలియదు, కానీ ఆ ఫోన్లను డెలివరీ అందుకున్న వారికే అసలు విషయం తెలుస్తుంది.
అయినప్పటికీ ఇదొక పెద్ద స్కామ్ అని జనాలకు ఇప్పటికీ గుర్తు లేదు. దాని గురించే మరిచిపోయారు. కేవలం రూ.251 మాత్రమే కదా అని చాలా మంది లైట్ తీసుకున్నట్టున్నారు. కానీ అలా కొన్ని వేల మంది బుక్ చేశారు కదా.. కనుక అది పెద్ద మొత్తమే అవుతుంది. అయినా ఇలాంటి స్కాములు అప్పటి కప్పుడు వార్తల్లో నిలుస్తాయి కానీ.. తరువాత పెద్దగా పట్టించుకోరు. జనాలు పూర్తిగా మరిచిపోతారు. ఇక్కడ కూడా ఇలాగే జరిగింది. ఇంకా ఇలాంటి స్కామ్లు అనేక విషయాల్లో జరుగుతూనే ఉన్నాయి. ఏం చేస్తాం.. ప్రజల తలరాత అలాంటిది మరి..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ రెండు రోజులు ఆలస్యంగా ప్రారంభం కానుందా.. అంటే.. అందుకు అవుననే సమాధానం…
తమిళ నటుడు, టీవీకే పార్టీ చీఫ్ విజయ్తో విడాకులు కావాలని కోరుతూ ఆయన భార్య సంగీత కోర్టులో పిటిషన్ దాఖలు…
తాను మొదట్లో క్రికెటర్ అవుతానని అనుకోలేదని, భారత ఆర్మీలో చేరి సేవలందించాలని చిన్నతనం నుంచే కలలు కన్నానని, కానీ క్రికెట్లోకి…
మార్చి 4, 2026న హైదరాబాద్లో జరగనున్న తమ వివాహ రిసెప్షన్కు హాజరు కావాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీని నూతన…
టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26, 2026) రాజస్థాన్లోని…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి గాను…
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ సూపర్ 8 దశలో వరుసగా రెండు మ్యాచ్లను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన…
కొత్తగా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా 8 వారాల తరువాతే ఓటీటీలోకి రావాలన్న నిబంధనపై ప్రస్తుతం…