మొబైల్స్ తయారీదారు హెచ్ఎండీ గ్లోబల్ నోకియా జి20 పేరిట ఓ నూతన స్మార్ట్ ఫోన్ను భారత్లో విడుదల చేసింది. ఇందులో 6.5 ఇంచుల హెచ్డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన డిస్ప్లేను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్లో 2.3 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జి35 ప్రాసెసర్ను అమర్చారు. 4జీబీ ర్యామ్ లభిస్తుంది. 64జీబీ స్టోరేజ్ వస్తుంది. మెమొరీని కార్డు ద్వారా 512జీబీ వరకు పెంచుకోవచ్చు.
ఈ ఫోన్లో ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ లభిస్తుంది. 2 ఏళ్ల వరకు సాఫ్ట్వేర్ అప్ గ్రేడ్స్ లభిస్తాయి. 3 ఏళ్ల వరకు సెక్యూరిటీ అప్ డేట్స్ ను అందిస్తారు. వెనుక వైపు 4 కెమెరాలు ఉన్నాయి. 48 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా కాగా 5, 2, 2 మెగాపిక్సల్ కెమెరాలు ఉన్నాయి. ముందు వైపు 8 మెగాపిక్సల్ కెమెరా ఉంది.
ఈ ఫోన్లో డ్యుయల్ సిమ్లను వేసుకోవచ్చు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ పక్క భాగంలో ఉంటుంది. గూగుల్ అసిస్టెంట్ కోసం ప్రత్యేక బటన్ను ఏర్పాటు చేశారు. డ్యుయల్ 4జి వీవోఎల్టీఈ, బ్లూటూత్ 5.0, యూఎస్బీ టైప్ సి వంటి ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి. ఇందులో 5050 ఎంఏహెచ్ బ్యాటరీ లభిస్తుంది. దీనికి ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ను ఇచ్చారు.
నోకియా జి20 ఫోన్ ధర రూ.12,999గా ఉంది. అమెజాన్తోపాటు నోకియా ఆన్లైన్ స్టోర్లో జూలై 7 నుంచి విక్రయిస్తారు. ఫోన్ను ప్రీ ఆర్డర్ కూడా చేసుకోవచ్చు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…