అహ్మదాబాద్లో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 టోర్నీ 25వ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. కోల్కతా నైట్ రైడర్స్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఢిల్లీ అలవోకగా ఛేదించింది. ఇంకా కొన్ని బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేరుకుంది. ఢిల్లీ బ్యాట్స్మెన్ చెలరేగి ఆడారు. దీంతో కోల్కతాపై ఢిల్లీ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
మ్యాచ్లో టాస్ గెలిచిన ఢిల్లీ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా కోల్కతా బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో కోల్కతా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. కోల్కతా బ్యాట్స్మెన్లలో ఆండ్రు రస్సెల్, శుబమన్ గిల్లు రాణించారు. 27 బంతులు ఆడిన రస్సెల్ 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 45 పరుగులు చేయగా, 38 బంతులు ఆడిన గిల్ 3 ఫోర్లు, 1 సిక్సర్తో 43 పరుగులు చేశాడు. ఇక ఢిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్, లలిత్ యాదవ్లు చెరో 2 వికెట్ల చొప్పున తీశారు. అవేష్ ఖాన్, మార్కస్ స్టాయినిస్లు చెరొక వికెట్ తీశారు.
అనంతరం బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 16.3 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. 3 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాట్స్మెన్లలో పృథ్వీ షా, శిఖర్ ధావన్లు అద్భుతంగా రాణించారు. 41 బంతుల్లోనే షా 11 ఫోర్లు, 3 సిక్సర్లతో 82 పరుగులు చేయగా, 47 బంతుల్లో ధావన్ 4 ఫోర్లు, 1 సిక్సర్తో 46 పరుగులు చేశాడు. కోల్కతా బౌలర్లలో ప్యాట్ కమ్మిన్స్ ఒక్కడే 3 వికెట్లు పడగొట్టాడు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…