క్రికెట్

యువ క్రికెట‌ర్ల‌కు కార్ల‌ను గిఫ్ట్‌లుగా ఇచ్చిన ఆనంద్ మ‌హీంద్రా..!!

భార‌తీయుల ప్ర‌తిభ‌ను ప్రోత్స‌హించ‌డంలో మ‌హీంద్రా గ్రూప్ చైర్మ‌న్ ఆనంద్ మ‌హీంద్రా ఎప్పుడూ ముందే ఉంటారు. అందులో భాగంగానే తాజాగా ఆయ‌న క్రికెట‌ర్లు శార్దూల్ ఠాకూర్‌, టి.న‌ట‌రాజ‌న్‌ల‌కు వారి ప్ర‌తిభ‌కు ప్రోత్సాహ‌కంగా మ‌హీంద్రా కంపెనీకి చెందిన థార్ కార్ల‌ను బ‌హుక‌రించారు. అయితే ఆనంద్ మ‌హీంద్రా పంపిన గిఫ్ట్‌ల‌ను అందుకున్న ఆ క్రికెట‌ర్లు ట్విట్ట‌ర్‌లో ఆయ‌నకు కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతూ పోస్టులు పెట్టారు.

ఆస్ట్రేలియాలో జ‌రిగిన బార్డ‌ర్ గవాస్క‌ర్ ట్రోఫీని భార‌త్ 2-1 తేడాతో కైవ‌సం చేసుకున్న విష‌యం విదిత‌మే. అందులో ప‌లువురు యువ క్రికెట‌ర్లు అద్భుతంగా రాణించారు. దీంతో ఆనంద్ మ‌హీంద్రా అప్ప‌ట్లోనే వారిని ప్ర‌శంసించారు. అయితే తాజాగా వారిలో శార్దూల్ ఠాకూర్‌, టి.న‌ట‌రాజ‌న్‌ల‌కు ఆయ‌న థార్ కార్ల‌ను బ‌హుమ‌తులుగా పంపించారు. ఆ కార్ల‌ను పొందిన ఠాకూర్‌, న‌ట‌రాజ‌న్‌లు ఆయ‌న‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు.

కొత్త మ‌హీంద్రా థార్ వ‌చ్చింది. మ‌హీంద్రా కంపెనీ రూపొందించిన ఈ కార్ అద్భుతంగా ఉంది. దీన్ని పంపింనందుకు ఆనంద్ మ‌హీంద్రాకు కృత‌జ్ఞ‌త‌లు.. అంటూ శార్దూల్ ఠాకూర్ ట్వీట్ చేశాడు. అలాగే న‌ట‌రాజ‌న్ కూడా ట్వీట్ చేశాడు. భార‌త్‌కు ఆడుతున్నందుకు గ‌ర్వంగా ఉంద‌ని, కార్‌ను గిఫ్ట్‌గా పంపినందుకు ధ‌న్య‌వాదాల‌ని, ఆనంద్ మ‌హీంద్రాకు త‌న ఆటోగ్రాఫ్‌తో కూడిన ష‌ర్ట్‌ను పంపిస్తాన‌ని చెప్పాడు.

అయితే న‌ట‌రాజ‌న్ ట్వీట్‌కు ఆనంద్ మ‌హీంద్రా స్పందించారు. ఆ ష‌ర్ట్‌ను ఓ సంప‌ద‌లా దాచుకుంటాన‌ని, గ‌ర్వంగా దాన్ని ధ‌రిస్తాన‌ని తెలిపారు. ఈ క్ర‌మంలో వారి మ‌ధ్య జ‌రిగిన ట్వీట్ల సంభాష‌ణ వైర‌ల్‌గా మారింది. నెటిజన్లు త‌మ దైన శైలిలో ఈ విష‌యం ప‌ట్ల స్పందిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

దసరా బరిలో ప్రభాస్ ‘ఫౌజీ’? రిలీజ్ డేట్‌పై నెట్టింట క్రేజీ ప్రచారం.. మేకర్స్ ఏమంటున్నారంటే?

రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…

Saturday, 31 January 2026, 10:37 AM

భారత్‌లోకి REDMI Note 15 Pro సిరీస్: 200MP కెమెరా, ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు.. ధర ఎంతంటే?

Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…

Friday, 30 January 2026, 9:51 PM

హై బీపీ ఉన్నవారు రోజుకు ఎంత ఉప్పు తినాలి? గుండెను కాపాడుకోవాలంటే ఈ రూల్స్ తప్పనిసరి!

హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…

Friday, 30 January 2026, 6:47 PM

బ్యాంక్ ఆఫ్ బరోడాలో 418 ఐటీ ఉద్యోగాలు: ఎలా అప్లై చేయాలంటే?

దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…

Friday, 30 January 2026, 5:17 PM

ప్రభాస్ ‘ది రాజా సాబ్’ ఓటీటీ అప్‌డేట్: స్ట్రీమింగ్ ఎక్కడంటే?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…

Friday, 30 January 2026, 4:07 PM

ధురంధర్ ఓటీటీ అప్‌డేట్: బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసిన బ్లాక్‌బస్టర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

బాలీవుడ్‌లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…

Friday, 30 January 2026, 10:50 AM

తిరుమల లడ్డూ వివాదం: వైసీపీ గేమ్ ప్లాన్ ఫలించిందా? ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చ!

గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…

Thursday, 29 January 2026, 10:15 PM

జూనియర్ ఎన్టీఆర్ వ్యక్తిగత హక్కులకు రక్షణ: ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు!

సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…

Thursday, 29 January 2026, 8:27 PM