కిరాణా షాపులలో ఏవైనా వస్తువులను కొనేందుకు వెళితే మనకు వింతైన అనుభవాలు ఎదురవుతుంటాయి. కొన్ని సార్లు షాపు వారు మనకు చిల్లర ఎక్కువ ఇస్తారు. పొరపాటుగా అలా చేస్తారు. లేదా మనమే కొన్నిసార్లు డబ్బు మరిచిపోయి వస్తుంటాం. అయితే కొందరు షాపుల వాళ్లు మాత్రం మనం కరెన్సీ నోట్లను ఇచ్చినా ఇవ్వలేదని దబాయిస్తారు. కావాలంటే మీరు ఇచ్చిన నోటును చూపించండి.. అని బుకాయిస్తారు. ఇలా చాలా మందికి జీవితంలో ఎప్పుడో ఒకసారి కొన్ని అనుభవాలు ఎదురయ్యే ఉంటాయి.
అయితే కేవలం కిరాణా షాపుల వద్దే కాదు, ఇతర చోట్ల కూడా ఇలాంటి అనుభవాలే చాలా మందికి అప్పుడప్పుడు ఎదురవుతుంటాయి. డబ్బులు ఇచ్చినా వారు ఇవ్వలేదని బుకాయిస్తారు. దీంతో చేసేది లేక కొందరు మళ్లీ డబ్బులు ఇస్తారు. అయితే కొందరు మాత్రం గొడవ పెట్టుకుంటారు. అది తారాస్థాయికి వెళ్తుంది. కానీ ప్రయోజనం ఉండదు.
అయితే ఇలాంటి అనుభవాలు ఎవరికైనా ఎదురుకావచ్చు. కనుక అలాంటి సందర్భాల్లో మనం సులభంగా పైచేయి సాధించడం కోసం ఒక చిన్నా సలహాను పాటించాలి. అదేమిటంటే..
కిరాణా షాపు అనే కాదు.. ఎక్కడికి వెళ్లినా సరే మీరు ఇచ్చే నోట్లకు చెందిన చివరి 3 అంకెలను గుర్తు పెట్టుకోండి. అలా గుర్తు పెట్టుకుంటే వారు మిమ్మల్ని మోసం చేయలేరు. నోట్ల గురించి అడిగితే మీరు వాటికి చెందిన నంబర్లను చెప్పవచ్చు. దీంతో తప్పు ఎవరు చేశారో తెలిసిపోతుంది. ఈ విధంగా అలాంటి ఘటనలు ఎదురుకాకుండా తెలివిగా వ్యవహరించవచ్చు. అయితే అందరూ ఇలా మోసం చేస్తారని కాదు, కానీ కొందరు చేస్తారు కదా.. అలాంటి వాళ్లకు బుద్ధి చెప్పాలంటే ఈ విధంగానే చేయాలి..!!
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…