కిరాణా షాపులలో ఏవైనా వస్తువులను కొనేందుకు వెళితే మనకు వింతైన అనుభవాలు ఎదురవుతుంటాయి. కొన్ని సార్లు షాపు వారు మనకు చిల్లర ఎక్కువ ఇస్తారు. పొరపాటుగా అలా చేస్తారు. లేదా మనమే కొన్నిసార్లు డబ్బు మరిచిపోయి వస్తుంటాం. అయితే కొందరు షాపుల వాళ్లు మాత్రం మనం కరెన్సీ నోట్లను ఇచ్చినా ఇవ్వలేదని దబాయిస్తారు. కావాలంటే మీరు ఇచ్చిన నోటును చూపించండి.. అని బుకాయిస్తారు. ఇలా చాలా మందికి జీవితంలో ఎప్పుడో ఒకసారి కొన్ని అనుభవాలు ఎదురయ్యే ఉంటాయి.
అయితే కేవలం కిరాణా షాపుల వద్దే కాదు, ఇతర చోట్ల కూడా ఇలాంటి అనుభవాలే చాలా మందికి అప్పుడప్పుడు ఎదురవుతుంటాయి. డబ్బులు ఇచ్చినా వారు ఇవ్వలేదని బుకాయిస్తారు. దీంతో చేసేది లేక కొందరు మళ్లీ డబ్బులు ఇస్తారు. అయితే కొందరు మాత్రం గొడవ పెట్టుకుంటారు. అది తారాస్థాయికి వెళ్తుంది. కానీ ప్రయోజనం ఉండదు.
అయితే ఇలాంటి అనుభవాలు ఎవరికైనా ఎదురుకావచ్చు. కనుక అలాంటి సందర్భాల్లో మనం సులభంగా పైచేయి సాధించడం కోసం ఒక చిన్నా సలహాను పాటించాలి. అదేమిటంటే..
కిరాణా షాపు అనే కాదు.. ఎక్కడికి వెళ్లినా సరే మీరు ఇచ్చే నోట్లకు చెందిన చివరి 3 అంకెలను గుర్తు పెట్టుకోండి. అలా గుర్తు పెట్టుకుంటే వారు మిమ్మల్ని మోసం చేయలేరు. నోట్ల గురించి అడిగితే మీరు వాటికి చెందిన నంబర్లను చెప్పవచ్చు. దీంతో తప్పు ఎవరు చేశారో తెలిసిపోతుంది. ఈ విధంగా అలాంటి ఘటనలు ఎదురుకాకుండా తెలివిగా వ్యవహరించవచ్చు. అయితే అందరూ ఇలా మోసం చేస్తారని కాదు, కానీ కొందరు చేస్తారు కదా.. అలాంటి వాళ్లకు బుద్ధి చెప్పాలంటే ఈ విధంగానే చేయాలి..!!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…