Badvel : బద్వేలులో వార్ వన్సైడే అయింది. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో దూసుకుపోయింది. సమీప బీజేపీ అభ్యర్థి దరిదాపుల్లో కూడా లేరు. దీంతో వైసీపీ విజయం సాధించింది. అన్ని రౌండ్లలోనూ వైసీపీ భారీ మెజారిటీతో ఆధిక్యంలో కొనసాగింది. చివరకు వైసీపీ గెలుపొందింది. మొత్తానికి ఉప ఎన్నికలో ప్రజలు మరోసారి వైసీపీకే పట్టం కట్టారు. బద్వేలు వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధ ఘన విజయం సాధించారు.
బద్వేలు ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధ భారీ మెజారిటీతో విజయం సాధించారు. 90,089 ఓట్ల మెజారిటీతో ఆమె గెలుపొందారు. వైసీపీకి మొత్తం 1,11,710 ఓట్లు వచ్చాయి. బీజేపీకి 21,612 ఓట్లు మాత్రమే వచ్చాయి. బద్వేల్లో మొత్తం 1,46,546 ఓట్లు పోలయ్యాయి. ఇక కాంగ్రెస్కు 6,205 ఓట్లు మాత్రమే వచ్చాయి.
బద్వేలు ఉప ఎన్నికలో నోటాకు 3,635 ఓట్లు రాగా, 90,089 ఓట్ల మెజారిటీతో వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధ ఘన విజయం సాధించారు. కాగా 2019 ఎన్నికల్లో బద్వేలు నియోజకవర్గంలో 77.64 శాతం పోలింగ్ నమోదైంది. అప్పట్లో 2,04,618 ఓట్లు ఉండగా, 1,58,863 ఓట్లు పోలయ్యాయి. 2019లో వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ వెంకట సుబ్బయ్య నిలబడగా.. ఆయన 44,734 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అయితే ఇప్పుడాయన భార్య డాక్టర్ సుధకు అంతకు రెట్టింపు మెజారిటీ రావడం విశేషం.
బద్వేల్లో గెలుపులో ఏపీలో ఎక్కడ చూసినా వైసీపీ సంబురాలు చేసుకుంటోంది. ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వీట్లు పంచుకుంటున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…