Heel Pain : ప్రస్తుతకాలంలో మడమల నొప్పి సాధారణంగా ఎదుర్కొనే సమస్యలలో ఒకటిగా చెప్పవచ్చు. మారుతున్న జీవన శైలి కారణంగా వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు మడమ నొప్పితో బాధపడుతున్నారు. అధిక బరువు, సరైన పోషకాహారం తీసుకోకపోవటం వంటి కారణాలతో మడమల నొప్పి సమస్య ఎదురవుతుంది. మనిషి ప్రతి కదలిక మడమలోని కీలు సహాయంతో జరుగుతుంది. మడమ ఎముకలో మార్పు రావటంవలన మడమ నొప్పితో కదలికలు అనేవి కష్టంగా మారుతుంది.
ఉదయం సమయంలో మంచంపై నుంచి కాలు కింద పెట్టగానే అడుగు తీసి అడుగు వేయలేనంత విపరీతమైన నొప్పితో ఇబ్బంది పడవలసి వస్తుంది. దీని కోసం మందులు వాడడం కన్నా ఇంటి చిట్కాలు ఎంతగానో సహకరిస్తాయి. ఇందు కోసం కేవలం గోరింటాకు, ఆముదం ఉంటే చాలు. గోరింటాకు ఆకులను శుభ్రంగా కడిగి ఆరబెట్టాలి. ఈ గోరింటాకు ఆకులను ఆముదంలో వేసి బాగా వేయించాలి. ఈ నూనెను వడకట్టి మడమ నొప్పి ఉన్న ప్రదేశంలో రాసి మసాజ్ చేసుకోవాలి. ఆ తరువాత వేయించిన గోరింటాకును మడమ నొప్పి ఉన్న చోట ఎంత వేడి అయితే పట్టగలరో పట్టులా వేసి గట్టిగా కట్టు కట్టాలి. ఈ విధంగా రెండు, మూడు రోజుల పాటు చేస్తే మడమ నొప్పి తగ్గుముఖం పడుతుంది.
మడమలో నొప్పి ఎక్కువగా బాధ పెడుతున్నప్పుడు పది నిమిషాలసేపు ఐస్ ముక్కతో పాదానికి కాపడం పెట్టాలి. ప్రతి రోజూ కొంత సమయం నడవడం ద్వారా రక్త ప్రసరణ బాగా జరిగి మడమల నొప్పి అనేది తగ్గుతుంది. అదేవిధంగా మడమల నొప్పి తగ్గడానికి మరో చిట్కా కూడా మనకు ఎంతగానో సహకరిస్తుంది. యాపిల్ సైడర్ వెనిగర్ కూడా మడమ నొప్పి తగ్గించడంలో ఎంతగానో సహకరిస్తుంది. బకెట్ గోరువెచ్చని నీటిలో మూడు లేదా నాలుగు టీస్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్ కలిపి మన పాదాలను 15 నిమిషాల పాటు ఉంచడం ద్వారా మడమల నొప్పి అనేది మటుమాయమవుతుంది. ఇలా రోజూ చేస్తే నొప్పి నుంచి బయట పడవచ్చు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…