Heel Pain : ప్రస్తుతకాలంలో మడమల నొప్పి సాధారణంగా ఎదుర్కొనే సమస్యలలో ఒకటిగా చెప్పవచ్చు. మారుతున్న జీవన శైలి కారణంగా వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు మడమ నొప్పితో బాధపడుతున్నారు. అధిక బరువు, సరైన పోషకాహారం తీసుకోకపోవటం వంటి కారణాలతో మడమల నొప్పి సమస్య ఎదురవుతుంది. మనిషి ప్రతి కదలిక మడమలోని కీలు సహాయంతో జరుగుతుంది. మడమ ఎముకలో మార్పు రావటంవలన మడమ నొప్పితో కదలికలు అనేవి కష్టంగా మారుతుంది.
ఉదయం సమయంలో మంచంపై నుంచి కాలు కింద పెట్టగానే అడుగు తీసి అడుగు వేయలేనంత విపరీతమైన నొప్పితో ఇబ్బంది పడవలసి వస్తుంది. దీని కోసం మందులు వాడడం కన్నా ఇంటి చిట్కాలు ఎంతగానో సహకరిస్తాయి. ఇందు కోసం కేవలం గోరింటాకు, ఆముదం ఉంటే చాలు. గోరింటాకు ఆకులను శుభ్రంగా కడిగి ఆరబెట్టాలి. ఈ గోరింటాకు ఆకులను ఆముదంలో వేసి బాగా వేయించాలి. ఈ నూనెను వడకట్టి మడమ నొప్పి ఉన్న ప్రదేశంలో రాసి మసాజ్ చేసుకోవాలి. ఆ తరువాత వేయించిన గోరింటాకును మడమ నొప్పి ఉన్న చోట ఎంత వేడి అయితే పట్టగలరో పట్టులా వేసి గట్టిగా కట్టు కట్టాలి. ఈ విధంగా రెండు, మూడు రోజుల పాటు చేస్తే మడమ నొప్పి తగ్గుముఖం పడుతుంది.
మడమలో నొప్పి ఎక్కువగా బాధ పెడుతున్నప్పుడు పది నిమిషాలసేపు ఐస్ ముక్కతో పాదానికి కాపడం పెట్టాలి. ప్రతి రోజూ కొంత సమయం నడవడం ద్వారా రక్త ప్రసరణ బాగా జరిగి మడమల నొప్పి అనేది తగ్గుతుంది. అదేవిధంగా మడమల నొప్పి తగ్గడానికి మరో చిట్కా కూడా మనకు ఎంతగానో సహకరిస్తుంది. యాపిల్ సైడర్ వెనిగర్ కూడా మడమ నొప్పి తగ్గించడంలో ఎంతగానో సహకరిస్తుంది. బకెట్ గోరువెచ్చని నీటిలో మూడు లేదా నాలుగు టీస్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్ కలిపి మన పాదాలను 15 నిమిషాల పాటు ఉంచడం ద్వారా మడమల నొప్పి అనేది మటుమాయమవుతుంది. ఇలా రోజూ చేస్తే నొప్పి నుంచి బయట పడవచ్చు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…