NTR : సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగానే కాకుండా రాజకీయాలో కూడా తనదైన ప్రతిభను చాటుకున్నారు నందమూరి తారక రామారావు. 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించి రాజకీయాల్లో తిరుగులేని వ్యక్తిగా ఎదిగారు. ఎన్నో పథకాల ద్వారా పేద ప్రజలకు సేవలు అందించి చరిత్రలో తెలుగు ప్రజలు ఎప్పటికీ మరిచిపోలేని సీఎంగా చెరగని ముద్ర వేసుకున్నారు. ఎన్టీఆర్ కు కుటుంబం అంటే అమితమైన ప్రేమ. నాతో పాటు నా కుటుంబీకులు కూడా అభివృద్ధి చెందాలని కోరుకునే వ్యక్తి ఎన్టీఆర్. ఆయన స్టార్ హీరోగా ఎదుగుతూనే తన సొంత తమ్ముడైన త్రివిక్రమ్ రావుని నిర్మాతగా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అన్నగారు అంటే త్రివిక్రమరావుకు కూడా ఎంతో గౌరవం ఉండేది. సాధారణంగా ప్రస్తుత సమాజంలో అన్నదమ్ములు అంటే ఆస్తుల కోసం గొడవలు పడటం లాంటివే చూస్తుంటాం. కానీ ఎన్టీఆర్, త్రివిక్రమ్ రావుల అనుబంధం చూస్తే రామలక్ష్మణులను తలపించేలా ఉంటుంది.
బంధువులే కాకుండా ఇండస్ట్రీలో ఎన్టీఆర్ సన్నిహితులు కూడా త్రివిక్రమ్ రావు, ఎన్టీఆర్ ల అనుబంధాన్ని గురించి గొప్పగా చెబుతుంటారు. ఎన్టీఆర్ హీరోగా, సీఎంగా అందరికీ చాలా బాగా తెలుసు. కానీ త్రివిక్రమ్ రావు గురించి పెద్దగా బయట ఎవరికీ తెలియదు. త్రివిక్రమ్ రావు సినిమాలు నిర్మిస్తున్న క్రమంలో తమ్ముడికి ఎన్టీఆర్ సహాయసహకారాలు అందించేవారు. ఎన్టీఆర్ సినిమాల్లోకి వెళ్లిన సమయంలో అన్నకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా త్రివిక్రమ్ రావు కుటుంబ బాధ్యతలు మొత్తం చూసుకునేవారు. కుటుంబాన్ని నేను జాగ్రత్తగా చూసుకుంటాను మీరు చెన్నైకి వెళ్లి సినిమా ప్రయత్నాలు చేయండని అన్నయ్యకు ధైర్యం చెప్పి పంపించారు త్రివిక్రమ్ రావు.
ఎన్టీఆర్ స్టార్ గా ఎదిగిన తర్వాత సొంత బ్యానర్ అయిన విజయలక్ష్మి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ పై మాత్రమే కాకుండా బయట బ్యానర్ నుండి మంచి సినిమా అవకాశాలు వచ్చినా ఎన్టీఆర్ ను చేయమని సలహా ఇచ్చేవారట త్రివిక్రమ్ రావు. ఎన్టీఆర్ త్రివిక్రమ్ రావు శరీరాలు వేరైనా ప్రాణాలు మాత్రం ఒక్కటే అన్నట్లు ఉండేవారట. ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీని స్థాపించిన తరవాత కూడా త్రివిక్రమ్ రావు పార్టీ వ్యవహారలను కూడా చూసుకునేవారు. ఎన్టీఆర్ రెండో సారి సీఎం అయిన తరువాత ఇద్దరి మధ్య ఓ సమస్య వచ్చిందట.
దాంతో త్రివిక్రమ్ రావు ఎన్టీఆర్ కు కొంత కాలం దూరం అయ్యారట. పార్టీకి తెలియకుండా పార్టీ పేరుపై 20వేల రూపాయల వరకూ విరాళాలను వసూలు చేశారట త్రివిక్రమ్ రావు. ఆ విషయం ఎన్టీఆర్ కు బయటి వ్యక్తుల ద్వారా తెలియడంతో తమ్ముడైన నువ్వు నాకు చెప్పకుండా అలా ఎందుకు విరాళాలు వసూలు చేశావంటూ ఎన్టీఆర్ తమ్ముడిపైన సీరియస్ అయ్యారట. ఆ విరాళాలను కార్యకర్తల సంక్షేమ నిధి కోసం వసూలు చేశారట త్రివిక్రమ్ రావు. ఆ తరువాత అన్నదమ్ములిద్దరూ చాలా కాలం పాటూ మాట్లాడుకోలేదట. కానీ ఆ తరువాత అన్నదమ్ములిద్దరూ మళ్లీ ఒకటైపోయారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…